చాలా మంది దసరా, దీపావళి పండుగ సీజన్లలో కొత్త వాహనాలను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటారు. కంపెనీలు కూడా వాహనదారుల కోసం పండగల ఆఫర్లు అందుబాటులోకి తీసుకువస్తుంటాయి. కస్టమర్లను ఆకర్షించేందుకు భారీ డిస్కౌంట్లను ప్రకటిస్తుంటాయి. కొత్త బైక్ కొనుగోలు చేయాలనుకునే వారికి మంచి సమయమిది. అమ్మకాలను పెంచుకోవడానికి వాహన తయారీ కంపెనీలు రకరకాల ఆఫర్లను ఈ పండగల సీజన్లోను ఎక్కువగా తీసుకువస్తుంటాయి. బైక్ను కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లకు బజాజ్ ఆటో కూడా తగ్గింపులను అందిస్తోంది. పల్సర్ బైకులపై బంపర్ ఆఫర్లను అందిస్తోంది.
2001 సంవత్సరంలో ప్రారంభమైన పల్సర్ స్పోర్ట్స్ మోటార్సైకిల్ సెగ్మెంట్లో మంచి ఆఫర్లను అందిస్తోంది. పల్సర్ బైక్లు 125 సిసి నుండి 400 సిసి వరకు వివిధ మోడళ్లు అందుబాటులో ఉన్నాయి. ఈ దసరా, దీపావళి పండగ సీజన్లను దృష్టిలో ఉంచుకుని పల్సర్ బైక్ ప్రియులకు అద్భుతమైన ఆఫర్లను ప్రకటించింది బజాజ్.
రూ.10 వేల తగ్గింపు:
పల్సర్ బైకు కొనుగోలు చేసిన వారికి ఎక్స్-షోరూమ్ ధరపై రూ.10,000 వరకు తగ్గింపు అందిస్తోంది. ఈ ఆఫర్లో రూ.5,000 వరకు క్యాష్బ్యాక్ ఉంటుంది. పల్సర్ 125 కార్బన్ ఫైబర్, NS125, N150, N160, NS200, N250లను కొనుగోలు చేసే కస్టమర్లు ఈ రూ. 5,000 వరకు క్యాష్బ్యాక్ పొందేందుకు అర్హులని కంపెనీ చెబుతోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి