బిగ్ బాస్ తెలుగు సీజన్ సండే ఎపిసోడ్ (అక్టోబర్ 27) ఎంతో ఉత్సాహకరంగా సాగింది. అమరన్ మూవీ టీమ్ సభ్యులు శివ కార్తికేయన్, సాయి పల్లవి అలాగే లక్కీ భాస్కర్ టీమ్ దుల్కర్ సల్మాన్, మీనాక్షి తదితరులు బిగ్ బాస్ వేదికపై సందడి చేశారు.
Bigg Boss 8 Telugu
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో మరో వారం ముగిసింది. ఎప్పటిలాగే ఈ వారం కూడా మరొక కంటెస్టెంట్స్ హౌస్ నుంచి బయటకు వెళ్లిపోయాడు. అయితే ఈ వారం నయని పావని ఎలిమినేట్ అవుతుందని చాలా మంది భావించారు. అయితే అనూహ్యంగా మెహ బూబ్ దిల్ సే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాడు. ఎనిమిదో వారంలో మొత్తం ఆరుగురు నిఖిల్, పృథ్వీ, ప్రేరణ, విష్ణుప్రియ, మెహబూబ్, నయని పావని లు నామినేషన్స్ లో ఉన్నారు. వీరిలో నయని పావని, మెహబూబ్ లకు తక్కువ ఓట్లు పడ్డాయి. అయితే నాగార్జున నయనిని సేవ్ చేసి మెహబూబ్ ఎలిమినేట్ అయినట్లు ప్రకటించాడు. దీంతో మెహబూబ్ నిరాశగా బయటకు వచ్చాడు.
ఇవి కూడా చదవండి
మద్దుతుగా నిలిచినందుకు అందరికీ ధన్యవాదలు: మెహబూబ్ ఎమోషనల్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.