India vs New Zealand: న్యూజిలాండ్తో జరుగుతున్న బెంగళూరు టెస్టు తొలి ఇన్నింగ్స్లో భారత జట్టు 46 పరుగులకు ఆలౌట్ అయింది. సొంతగడ్డపై భారత్కు ఇదే అతి తక్కువ స్కోరు కావడం గమనార్హం. అంతకుముందు 1987లో వెస్టిండీస్తో జరిగిన ఢిల్లీ టెస్టులో టీమిండియా 75 పరుగులకు ఆలౌట్ అయింది.
బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో గురువారం జరిగిన మ్యాచ్లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే, న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్లు రోహిత్ నిర్ణయాన్ని తప్పుగా నిరూపించారు.
స్వింగ్, బౌన్సీ పిచ్పై భారత బ్యాట్స్మెన్స్ ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయారు. టీమిండియా తరపున రిషబ్ పంత్ అత్యధికంగా 20 పరుగులు చేశాడు. 2 పరుగుల వద్ద కెప్టెన్ రోహిత్ శర్మ ఔటయ్యాడు. కొంత సేపు ఆడిన అతను భారత స్కోర్ 13 పరుగుల వద్ద టిమ్ సౌథీ బౌలింగ్లో ఔటయ్యాడు. విరాట్ కోహ్లీ, సర్ఫరాజ్ ఖాన్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ తమ ఖాతాలను కూడా తెరవలేకపోయారు. మాట్ హెన్రీ 5 వికెట్లు తీయగా, విలియం ఓ రూర్కే 3 వికెట్లు తీశాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..