ఇక అతి చిన్నరైల్వే స్టేషన్లు, అతి పెద్ద రైల్వే స్టేషన్లు, అత్యధిక ప్రయాణీకులతో ఎప్పుడూ రద్దీగా ఉండే స్టేషన్లు కూడా ఉన్నాయి. వాటితో పాటు అందమైన రైల్వే మార్గాలు కూడా అనేకం మనం చూడొచ్చు. వీటితో పాటుగానే అతి భయంకరంగా ఉండే, డేంజరస్ రైల్వే మార్గాలు కూడా ఉన్నాయి. ఇలా ఒక్కటి రెండు కాదు..ఎన్నో ఆసక్తికర విషయాలు ఉన్నాయి. భారతీయ రైల్వేలో ఒక్కో రైల్వే లైన్, స్టేషన్, ట్రైన్ అన్ని దేనికదే ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఇందులో భాగంగానే ఇప్పుడు మనం ఓ ప్రత్యేక రైలు గురించి తెలుసుకుందాం..
India's smallest rider bid that has lone 3 coaches
Updated on: Feb 08, 2025 | 9:40 AM
ప్రపంచవ్యాప్తంగా రైల్వే నెట్ వర్క్ ఉన్న దేశాల్లో భారత్ నాలుగో స్థానంలో కొనసాగుతోంది. అలాంటి ఇండియన్ రైల్వేలో ఎన్నో వింతలు, విశేషాలు ఉన్నాయి. ఇక్కడ మనం అత్యంత వేగంగా వెళ్లే రైళ్లను చూడొచ్చు. అలాగే, అత్యంత నెమ్మదిగా ప్రయాణించే రైళ్లు కూడా ఉన్నాయి. ఇక అతి చిన్నరైల్వే స్టేషన్లు, అతి పెద్ద రైల్వే స్టేషన్లు, అత్యధిక ప్రయాణీకులతో ఎప్పుడూ రద్దీగా ఉండే స్టేషన్లు కూడా ఉన్నాయి. వాటితో పాటు అందమైన రైల్వే మార్గాలు కూడా అనేకం మనం చూడొచ్చు. వీటితో పాటుగానే అతి భయంకరంగా ఉండే, డేంజరస్ రైల్వే మార్గాలు కూడా ఉన్నాయి. ఇలా ఒక్కటి రెండు కాదు..ఎన్నో ఆసక్తికర విషయాలు ఉన్నాయి. భారతీయ రైల్వేలో ఒక్కో రైల్వే లైన్, స్టేషన్, ట్రైన్ అన్ని దేనికదే ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఇందులో భాగంగానే ఇప్పుడు మనం ఓ ప్రత్యేక రైలు గురించి తెలుసుకుందాం..
మన దేశంలో కేవలం 3 బోగీలు మాత్రమే ఉన్న ట్రైన్ కూడా ఉందని మీకు తెలుసా..? ఇది ఇండియాలోనే అతి చిన్న ప్యాసింజర్ రైలుగా గుర్తింపు పొందింది. అదే కొచ్చిన్ హార్బర్ టెర్మినస్ నుంచి ఎర్నాకులం జంక్షన్ వరకు ప్రయాణించే మూడు బోగీల డెము రైలు. పచ్చని రంగులో చూడముచ్చటగా ఉండే ఈ డెము రైలులో 300 మంది కూర్చునే సీట్లు ఉన్నాయి. ఈ రైలు రోజుకు రెండుసార్లు ఉదయం, సాయంత్రం నడుస్తుంది. రైలు మార్గం కూడా చాలా అందంగా ఉంటుంది. స్థానికులు దీనిని చూసి ఆనందిస్తారు. ఈ రైలు ఒకే స్టాప్తో 40 నిమిషాల్లో 9 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. కానీ ఎక్కేవాళ్లే కరువయ్యారు. ప్రయాణికులు లేకపోవడంతో ఈ రైలును ఆపేస్తారేమోనని టాక్ నడుస్తోంది.
ఇవి కూడా చదవండి
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..