తాను క్షేమంగానే ఉన్నానని కార్యకర్తలు, ఆత్మీయులు , అభిమానులు ఎవరు ఆందోళన చెంద వద్దని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ వీడియో విడుదల చేశారు. హైదరబాద్ నుండి ఆదిలాబాద్ వస్తుండగా నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి వద్ద ఎమ్మెల్యే వాహనం రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే పీఏకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం నుండి ఎమ్మెల్యే క్షేమంగా బయటపడ్డారు.
ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రయాణిస్తున్న వాహనాన్ని వెనుక నుండి లారీ ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ విషయం తెలియగానే భారతీయ జనతా పార్టీ శ్రేణులు, ఎమ్మెల్యే పాయల్ శంకర్ అభిమానులు ఆందోళనకు గురయ్యారు. ప్రమాద ఘటనపై స్పందించిన ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ తాను క్షేమంగానే ఉన్నానంటూ ఓ వీడియో విడుదల చేశారు. ఆదిలాబాద్ కు క్షేమంగా చేరుకున్నానని.. పత్తి కొనుగోళ్ల విషయంలో తలెత్తిన ప్రతిష్టంభనపై పత్తి రైతులతో మాట్లాడేందుకు వ్యవసాయ మార్కెట్ యార్డ్కు వెళ్తున్నానంటూ తెలిపారు.
వీడియో చూడండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..