November Rules: గ్యాస్ సిలిండర్ నుంచి టెలికమ్యూనికేషన్ వరకు.. నవంబర్‌లో కీలక మార్పులు!

2 hours ago 1

November Rules Changes: ప్రతి నెల ప్రారంభంలో గ్యాస్ సిలిండర్ నుండి ఆధార్ కార్డ్, క్రెడిట్ కార్డ్, టెలికాం వరకు వివిధ మార్పులు అవుతుంటాయి. దీని ప్రకారం, అక్టోబర్ ప్రారంభంలో కూడా అనేక మార్పులు జరిగాయి. నవంబర్ నెలకు మూడు రోజులు మిగిలి ఉన్నందున గ్యాస్ సిలిండర్ ధరలు, ఆధార్ కార్డు, క్రెడిట్ కార్డ్, టెలికమ్యూనికేషన్స్ తదితర అంశాల్లో పలు మార్పులు చేయబోతున్నట్లు సమాచారం. ఈ సందర్భంలో నవంబర్ నుంచి ఎలాంటి మార్పులు జరగబోతున్నాయో చూద్దాం.

ఇది కూడా చదవండి: Aadhaar Update: ఆధార్‌ వినియోగదారులకు గుడ్‌న్యూస్‌.. కొత్త అప్‌డేట్‌.. కేంద్రం కీలక నిర్ణయం!

గ్యాస్ సిలిండర్ ధర:

ప్రతి నెల ప్రారంభంలో చమురు కంపెనీలు ఎల్‌ఫీజీ గ్యాస్ సిలిండర్ల ధరలను సవరిస్తాయి. దీని ప్రకారం నవంబర్ 1 నుంచి గ్యాస్ సిలిండర్ ధరలో మార్పు ఉండబోతున్నట్లు సమాచారం. గృహావసరాల గ్యాస్ సిలిండర్ల ధరలు గత కొన్ని నెలలుగా యథాతథంగా ఉండడం గమనార్హం.

CNG ధర

నవంబర్ 1 నుంచి ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరలను మాత్రమే కాకుండా సీఎన్‌జీ, పీఎన్‌జీ ధరలను కూడా చమురు కంపెనీలు మార్చబోతున్నట్లు సమాచారం. గత కొన్ని నెలలుగా CNG సహా ATF ధరలు తగ్గించాయి. దీనికి ప్రధాన కారణంగా పండుగ సీజన్‌గా భావించారు. ఈ పరిస్థితిలో నవంబర్ 1 నుంచి వీటి ధరల్లో మార్పు రావచ్చని భావిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Ratan Tata: పెంపుడు కుక్కతో పాటు పని మనుషులకు కూడా ఆస్తి రాసిచ్చిన రతన్‌ టాటా!

SBI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ నియమాలు:

ఎస్‌బీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ నిబంధనలలో నవంబర్ నుండి కొత్త మార్పులను తీసుకురావాలని యోచిస్తోంది. దీని ప్రకారం.. నవంబర్ 1 నుండి అసురక్షిత క్రెడిట్ కార్డ్‌లకు నెలవారీ ఫైనాన్స్ ఛార్జీ 3.75 శాతం వసూలు చేస్తుంది. అంతే కాకుండా ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించి విద్యుత్, గ్యాస్ వంటి యుటిలిటీల కోసం మీరు రూ.50,000 కంటే ఎక్కువ చెల్లిస్తే 1% రుసుము వసూలు చేయనున్నట్లు తెలుస్తోంది.

మ్యూచువల్ ఫండ్ నిబంధనలు:

నవంబర్ నుంచి మ్యూచువల్ ఫండ్స్ కోసం సెబీ కఠినమైన ట్రేడింగ్ నిబంధనలను ప్రవేశపెట్టబోతున్నట్లు సమాచారం. దీని ప్రకారం నవంబర్ 1వ తేదీ నుంచి ఏఎంసీలు నామినీలు లేదా బంధువులకు సంబంధించి రూ.15 లక్షల కంటే ఎక్కువ లావాదేవీలు నిర్వహిస్తే అధికారులకు రిపోర్టు చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు.

టెలికాం నియమాలు:

స్పామ్‌లను నివారించడానికి మెసేజ్ ట్రేస్‌బిలిటీని అమలు చేయాలని జియో, ఎయిర్‌టెల్‌తో సహా టెలికాం కంపెనీలను ప్రభుత్వం ఆదేశించింది. దీని కారణంగా టెలికాం కంపెనీలు ఏవైనా కొత్త నిబంధనలను అమలు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. పైన పేర్కొన్న మార్పులన్నీ నవంబర్ 1 నుంచి అమలులోకి రానున్నాయి.

ఇది కూడా చదవండి: Indian Railways: రైలు పట్టాలపై ఇసుక ఎందుకు పోస్తారో తెలుసా?.. కారణం ఏంటంటే..

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article