డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షనర్స్ వెల్ఫేర్ (DOPPW), పర్సనల్, పీజీ & పెన్షన్ల మంత్రిత్వ శాఖ కింద, 80 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు అదనపు పెన్షన్కు అర్హులు అని ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది. వాటి అర్హతలు ఇలా ఉన్నాయి..
Central Govt Pensioners
80 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు కారుణ్య భత్యం అని పిలువబడే అదనపు పెన్షన్కు అర్హత పొందుతారని పెన్షన్, పెన్షనర్ల సంక్షేమ శాఖ (DOPPW) ఇటీవల ప్రకటించింది. 80 ఏళ్లు నిండిన కేంద్ర ప్రభుత్వ సివిల్ సర్వీస్ పదవీ విరమణ పొందిన వారికి ఈ అనుబంధ ప్రయోజనాలను పొందేందుకు కొత్త మార్గదర్శకాలు జారీ చేయబడ్డాయి. తాజాగా విడుదల చేసిన మార్గదర్శకాలు ఈ అదనపు అలవెన్సుల పంపిణీ ప్రక్రియను మరింత సులభతరం చేస్తాయి.
అదనపు పెన్షన్ క్రింది పద్ధతిలో చెల్లిస్తారు:
- 80 నుండి 85 సంవత్సరాల వయస్సు: ప్రాథమిక పెన్షన్/ కారుణ్య భత్యంలో 20 శాతం
- 5 నుండి 90 సంవత్సరాల వయస్సు: ప్రాథమిక పెన్షన్/ కారుణ్య భత్యంలో 30 శాతం
-
90 నుండి 95 సంవత్సరాల వయస్సు: ప్రాథమిక పెన్షన్/ కారుణ్య భత్యంలో 40 శాతం.
-
95 నుండి 100 సంవత్సరాల వయస్సు: ప్రాథమిక పెన్షన్/ కారుణ్య భత్యంలో 50 శాతం.
-
100 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ: ప్రాథమిక పెన్షన్/కారుణ్య భత్యంలో 100 శాతం
అదనపు పెన్షన్ చెల్లింపులకు అర్హతలు:
అదనపు పెన్షన్ లేదా కారుణ్య భత్యం పెన్షనర్ నియమించబడిన వయస్సు ఉన్నావారికి నెల మొదటి రోజు నుండి ఇది వర్తిస్తుంది. ఉదాహరణకు, ఆగస్ట్ 20, 1942న జన్మించిన పెన్షనర్ ఆగస్టు 1, 2022 నుండి అదనపు 20 శాతం పెన్షన్కు అర్హులు అవుతారు. ఈ అదనపు పెన్షన్ చెల్లింపు పెన్షనర్లకు వృద్ధాప్యంతో ముడిపడి ఉన్న జీవన వ్యయాన్ని నిర్వహించడంలో సహాయపడటానికి రూపొందించారు.