PM Modi: మోదీ నిర్ణయాలు అద్భతం.. ప్రశంసలతో ముంచెత్తిన ‘కెనడాస్ వారెన్ బఫెట్’ ప్రేమ్ వాట్సా

2 hours ago 1

వేగంగా అభివృద్ధి చెందుతున్న భారతదేశ ఆర్థిక వ్యవస్థపై ప్రపంచ పెట్టుబడిదారులకు విశ్వాసం పెరుగుతోంది. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీసుకుంటున్న చర్యలపై ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామికవేత్తలు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఈ క్రమంలోనే ‘కెనడాస్ వారెన్ బఫెట్’గా పేరు తెచ్చుకున్న, ఫెయిర్‌ఫాక్స్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్ CEO ప్రేమ్ వాట్సా ప్రధాని మోదీని అభినందించారు. భారతదేశం రెండంకెల ఆర్థిక వృద్ధిని సాధించగల సామర్థ్యంపై తన విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారడానికి ఇది అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.

హైదరాబాద్‌లో జన్మించిన ప్రేమ్ వాట్సా, ఇప్పుడు టొరంటోలో 97 బిలియన్ డాలర్ల కంపెనీకి నాయకత్వం వహిస్తున్నారు. దక్షిణ కొరియా, జపాన్, చైనా వంటి దేశాలు చాలా కాలం పాటు ఈ ఘనతను సాధించాయని ఆయన గుర్తు చేశారు. ఇటీవల భారతదేశ పర్యటన సందర్భంగా, వాట్సా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా వంటి ఆయన కార్యక్రమాలను అత్యుత్తమమైనవిగా పేర్కొంటూ ప్రశంసించారు. మోదీ నాయకత్వంలో భారతదేశం 10% వార్షిక ఆర్థిక వృద్ధిని అందించగలదని ప్రేమ్ వాట్సా విశ్వాసం వ్యక్తం చేశారు.

భారతదేశంలో తెలివైన, కష్టపడి పనిచేసే వ్యక్తులు పుష్కలంగా ఉన్నారని, ఈ లక్ష్యాన్ని సాధించడం సాధ్యమవుతుందని వాట్సా ఉద్ఘాటించారు. యుఎస్‌కి ఉన్నది ఉచిత సంస్థ. భారతదేశం దానిని స్పేడ్స్‌లో పొందుతోంది. మేక్ ఇన్ ఇండియా, స్టార్ట్‌అప్ ఇండియా ఈ కార్యక్రమాలన్నీ ప్రధానమంత్రిచే అత్యద్భుతమైనవి. మరియు ప్రధానమంత్రి 10% ఆర్థిక వృద్ధిని అందిస్తారని నేను భావిస్తున్నాను అని ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. భారతదేశం కోసం తన 2047 లక్ష్యాలను చేరుకోవడానికి ప్రధానికి సహాయపడుతుంది. కొరియా, జపాన్, తైవాన్ దశాబ్దాలుగా చేశాయి. ఇక్కడ చాలా మంది తెలివైన, కష్టపడి పనిచేసే వ్యక్తులు ఉన్నారు. మోదీ నాయకత్వంలో ఎవరూ దానిని సాధించలేకపోవడానికి కారణం లేదన్నారు.

భారతదేశంలో 7 బిలియన్ల డాలర్ల పెట్టుబడి పోర్ట్‌ఫోలియోను కలిగి ఉన్న వాట్సా, ఆ మొత్తాన్ని రెట్టింపు చేయడానికి కట్టుబడి, ప్రధాని మోదీ పట్ల తన అభిమానాన్ని వ్యక్తం చేశారు. తనను తాను అభిమానిగా అభివర్ణించుకున్నారు. మోదీ దేశంలో వ్యాపారాన్ని మరింత సులభతరం చేస్తారని నమ్ముతున్ననన్నారు. అధిక వృద్ధిని సాధించడానికి, వాట్సా భారతదేశంలో వ్యాపారాన్ని సులభతరం చేయడానికి ప్రాధాన్యత ఇవ్వడం శుభపరిణామం అన్నారు.

హైదరాబాద్‌లో జన్మించిన ప్రేమ్ వాట్సా, IIT-మద్రాస్ పూర్వ విద్యార్థి, కెనడాకు వలస వచ్చిన తర్వాత 1980లలో ఫెయిర్‌ఫాక్స్‌ను స్థాపించారు. కంపెనీ ఉత్తర అమెరికా, లాటిన్ అమెరికా, యూరప్, ఆసియా, పశ్చిమ ఆసియా అంతటా బహుళ బీమా వ్యాపారాలను కలిగి ఉంది. ఇది ప్రపంచవ్యాప్తంగా స్థిరాస్తి, ప్రమాద బీమా కంపెనీలలో అతిపెద్ద పెట్టుబడిదారులలో ఒకటిగా నిలిచింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article