SL vs NZ: ఏందయ్యా, ఇది.. 8 టెస్టుల్లో 5వ సెంచరీలు.. బ్రాడ్‌మన్ కంటే చాలా డేంజరస్‌గా ఉన్నావ్

2 hours ago 1

Kamindu Mendis: గాలే వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో శ్రీలంక ఆల్ రౌండర్ కమిందు మెండిస్ భారీ సెంచరీతో క్రికెట్ దిగ్గజాల రికార్డులను సమం చేశాడు. తన టెస్టు కెరీర్‌లో 8వ టెస్టు మ్యాచ్ మాత్రమే ఆడుతున్న మెండిస్ 5వ సెంచరీతో చెలరేగాడు. దీంతో అతను గ్రేట్ బ్యాట్స్‌మెన్ డాన్ బ్రాడ్‌మన్‌ను సమం చేశాడు. బ్రాడ్‌మన్, జార్జ్ హెడ్లీ తమ మొదటి 13 ఇన్నింగ్స్‌లలో 5 సెంచరీలు పూర్తి చేశారు. ఇప్పుడు మెండిస్ కూడా తన 8వ టెస్టు మ్యాచ్‌లో 13వ ఇన్నింగ్స్‌లో 5వ సెంచరీ పూర్తి చేసి దిగ్గజాల జాబితాలో చేరాడు.

ఇది మాత్రమే కాదు, ఈ మ్యాచ్‌లో మొదటి రోజు అర్ధ సెంచరీ చేయడం ద్వారా మెండిస్ ఆశ్చర్యకరమైన ప్రపంచ రికార్డును సృష్టించాడు. 147 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో, కమిందు మెండిస్ తన అరంగేట్రం తర్వాత వరుసగా 8 టెస్ట్ మ్యాచ్‌ల్లో యాభైకి పైగా పరుగులు చేసిన ప్రపంచంలోనే మొదటి ఆటగాడిగా నిలిచాడు.

కాంబ్లీ రికార్డు తృటిలో మిస్..

గాలెలో రికార్డు సెంచరీ చేసిన మెండిస్ ఇప్పుడు టెస్టుల్లో 900 పరుగుల మార్కును అధిగమించాడు. దీంతో అతి తక్కువ టెస్టు ఇన్నింగ్స్‌లో 900 పరుగులు చేసిన 5వ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. భారత క్రికెటర్ వినోద్ కాంబ్లీ, వెస్టిండీస్‌కు చెందిన ఎవర్టన్ వీక్స్ సంయుక్తంగా టెస్టుల్లో వేగంగా 900 పరుగులు చేసిన రికార్డును కలిగి ఉన్నారు. వీరిద్దరూ 11 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత సాధించారు.

ఇవి కూడా చదవండి

స్పెషల్ రికార్డుపై కన్నేసిన మెండిస్..

కమిందు మెండిస్ 1000 టెస్టు పరుగులు పూర్తి చేయడానికి ఇంకా 78 పరుగులు చేయాలి. ఈ ఇన్నింగ్స్‌లో లేదా తర్వాతి 2 ఇన్నింగ్స్‌ల్లో అతను ఈ ఫీట్ సాధించగలిగితే, అతను భారత క్రీడాకారిణి యశస్వి జైస్వాల్ రికార్డును బద్దలు కొడతాడు. జైస్వాల్ 16 ఇన్నింగ్స్‌ల్లో 1000 పరుగుల మార్క్‌ను చేరుకున్నాడు. అత్యంత వేగంగా 1000 టెస్టు పరుగులు చేసిన రికార్డు హెర్బర్ట్ సట్‌క్లిఫ్, ఎవర్టన్ వీక్స్ పేరిట ఉంది. ఈ ఇద్దరు ఆటగాళ్లు 12 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఫీట్‌ను సాధించగా, డాన్ బ్రాడ్‌మాన్ 13 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఫీట్‌ను అధిగమించారు.

పటిష్ట స్థితిలో శ్రీలంక..

ఈ మ్యాచ్‌లో శ్రీలంక టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే ఆరంభం బాగోలేదు. జట్టు స్కోరు 2 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. అయితే, ఆ తర్వాత బ్యాట్స్‌మెన్ అందరూ అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. దినేష్ చండిమాల్, కమిందు మెండిస్ సెంచరీలు చేయగా, దిముత్ కరుణరత్నే 46 పరుగులు, ఏంజెలో మాథ్యూస్ 88 పరుగులు, కెప్టెన్ ధనంజయ్ డిసిల్వా 44 పరుగులు చేశారు. దీంతో లంక జట్టు 5 వికెట్ల నష్టానికి 400 పరుగులు దాటింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article