Tendulkar: “అప్పుడు యువీకి క్యాన్సర్ ఉందని తెలియదు” కానీ.. 2011 వల్డ్ కప్ పై సచిన్ కామెంట్స్..

2 hours ago 2

భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఇటీవల తన ఆట జీవితంలో ఆసక్తికరమైన అనుభవాలను పంచుకున్నారు. భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్, ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్‌లతో తాను కలిగిన అనుభవాలను వెల్లడిస్తూ, సెహ్వాగ్ గురించి ఒక హాస్యాస్పదమైన కథను చెప్పాడు.

సెహ్వాగ్ గురించి మాట్లాడుతూ, “అతను ఎప్పుడూ నేను చెప్పినదానికి విరుద్ధంగా చేసేవాడు. నేను అతనిని కొన్నిసార్లు డిఫెన్సె ఆడమంటే, అతను వెళ్ళి బౌలర్లను ధాటిగా ఎదుర్కొని భారీ షాట్లు ఆడేవాడు. అప్పుడు నేను మెల్లగా అతనికి విరుద్ధంగా చెప్పడం అలవాటుగా మార్చుకున్నాను. నేను చెప్పేది విని, సెహ్వాగ్ తాను చేయాలనుకున్నదే చేసేవాడు.”

అలాగే, 2011 ప్రపంచ కప్ ముందు యువరాజ్ సింగ్ కొంత నీరసంగా కనిపించాడని, ఆ సమయంలో అతనికి క్యాన్సర్ ఉన్న సంగతి తెలియదని టెండూల్కర్ గుర్తు చేసుకున్నాడు. “యువీని డిన్నర్‌కు పిలిచి, అతను ఎందుకు నీరసంగా ఉన్నాడని అడిగాను. అతను, ‘పాజీ, నేను బంతిని సరిగ్గా టైమింగ్ చేయడం లేదు’ అన్నాడు. నేను అతనికి బ్యాటింగ్ గురించి మర్చిపోయి ఫీల్డింగ్‌పై దృష్టి పెట్టమని చెప్పాను. ఆ తర్వాత, అతనిలో మళ్ళీ ఉత్సాహం కనిపించింది” అని సచిన్ వెల్లడించారు.

టెండూల్కర్ జట్టుగా ఒకరికొకరు అండగా ఉండాల్సిన అవసరాన్ని వివరించారు. “మీరు మంచి ఫామ్‌లో ఉండవచ్చు, మరొకరు లేకపోవచ్చు. లేదా మరొకరు మంచి ఫామ్‌లో ఉంటే, మీరు ఉండకపోవచ్చు. కానీ జట్టుగా మీరు నమ్మకంతో కలిసి ఉండాలి.”

న్యూజిలాండ్‌తో టెస్ట్‌లో క్రిస్ కైర్న్స్ బంతిని రివర్స్ స్వింగ్ చేస్తున్న సందర్భాన్ని ఉదహరిస్తూ, “నేను, రాహుల్ ద్రవిడ్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు, కైర్న్స్ బంతిని రివర్స్ స్వింగ్ చేసేవాడు. నేల కారణంగా బంతి మెరిసే వైపు కనిపించేది కాదు. అప్పుడు రాహుల్‌తో కలిసి, ‘నేను ఒక చేతిలో బ్యాట్ పెడతాను, నువ్వు బంతి కదలికను అంచనా వేయగలవా?’ అని అడిగాను. మా మధ్య అవగాహనతోనే ఆ క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నాం,” అని చెప్పాడు.

సచిన్ ఈ ప్రసంగాన్ని రాష్ట్రపతి భవన్‌లో ఇచ్చారు, అక్కడ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు తన ఆటోగ్రాఫ్‌తో కూడిన భారత టెస్ట్ జెర్సీని అందజేశారు. టెండూల్కర్ తన కుటుంబ సభ్యులు, భార్య అంజలి, కుమార్తె సారాతో కలిసి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

భారత క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో ఒకడైన టెండూల్కర్, 2014లో భారత అత్యున్నత పౌర పురస్కారం ‘భారతరత్న’ను అందుకున్నారు. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు (టెస్టుల్లో 51, వన్డేల్లో 49) చేసిన ఆటగాడిగా ఆయన రికార్డు సాధించారు. క్రికెట్‌లో తన అపారమైన అనుభవాలను పంచుకుంటూ, జట్టు ఆటలో భాగస్వామ్యం, నమ్మకం, బలమైన సంబంధాల ముఖ్యతను హైలైట్ చేశారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article