Vijayawada: దుర్గమ్మా నీ దర్శనానికి వస్తే.. 4వ అంతస్థు కిటికీలో నుంచి పడి 4 ఏళ్ల చిన్నారి మృతి

2 hours ago 1

విజయవాడ మాచవరంలో విషాదం చోటుచేసుకుంది. ఓ హోటల్‌లో పైనుంచి పడి నాలుగేళ్ల చిన్నారి చనిపోయింది. ఆడుకుంటూ నాలుగో అంతస్తు నుంచి జారిపడింది చిన్నారి. చిన్నారి చనిపోవడంతో కుటుంబ సభ్యులు తల్లడిల్లిపోయారు.

 దుర్గమ్మా నీ దర్శనానికి వస్తే.. 4వ అంతస్థు కిటికీలో నుంచి పడి 4 ఏళ్ల చిన్నారి మృతి

Vijayawada Durga Temple

|

Updated on: Oct 28, 2024 | 3:47 PM

అప్పటివరకు అన్నతో కలిసి దొంగా పోలీస్ ఆడుకున్న ఆ పాప.. అంతలోనే విగతజీవిగా మారిపోయింది. ముద్దు ముద్దు మాటలతో.. తమ కళ్ల ముందు నవ్వుతూ తిరుగుతున్న పాప మరణంతో.. తల్లిండ్రులు గుండెలు అవిసేలా రోదించారు.  విజయవాడ మాచవరంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ హోటల్‌లో ఆడుకుంటున్న పాప.. 4వ ఫ్లోర్ రూమ్‌లోని కిటికీ నుంచి ప్రమాదవశాత్తూ పడిపోయి మృతి చెందింది. కనకదుర్గ దర్శనం కోసం విశాఖ నుంచి విజయవాడ ఆ పాప కుటుంబానికి జీవిత కాల విషాదం మిగిలింది. చిన్నారి చనిపోవడంతో కుటుంబ సభ్యులు తల్లడిల్లిపోయారు. పాప డెడ్‌బాడీని మార్చురీ తరలించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖకు చెందిన నాగరాజు కుటుంబం శ్రీశైలం వెళ్తోంది. నాగరాజుకు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. దారి మధ్యలో విజయవాడ దుర్గమ్మ దర్శనం చేసుకోవాలని అనుకున్నారు. నగరంలోని మాచవరంలోని ఓ హోటల్‌లో బస చేసేందుకు దిగారు. అయితే రాత్రి సమయంలో అన్నాచెల్లెల్లు ఇద్దరూ.. గేమ్ ఆడుకుంటుండగానే.. దాక్కునేందుకు 4 ఏళ్ల చిన్నారి కిటికి డోర్ తెరుస్తూ.. ఆ ప్రయత్నంలోనే ప్రమాదవశాత్తు కిటికీ నుంచి జారి కింద పడిపోయి.. స్పాట్‌లోనే మృతి చెందింది. సమాచారం అందగానే హుటాహుటిన స్పాట్‌కు చేరుకున్న మాచవరం పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article