డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ శాఖను ఏర్పాటుచేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఈ శాఖ.. వృథా ఖర్చులను తగ్గించడం, ప్రభుత్వ వ్యవస్థలో సమూల మార్పులే లక్ష్యంగా పని చేస్తుంది. ఈ బాధ్యతలను ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కు అప్పగించారు ట్రంప్. తాజాగా ఈ విభాగం ఆరుగురు యువ ఇంజినీర్లను విధుల్లోకి తీసుకుంది.
వీరిలో భారత సంతతికి చెందిన ఆకాశ్ బొబ్బ కూడా ఉన్నాడు. దీంతో అతడి పేరు ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. డోజ్ నియమించుకున్న ఆరుగురు కూడా 19 నుంచి 24 ఏళ్ల లోపు వయసు వారేనని ఓ అంతర్జాతీయ కథనం తెలిపింది. వీరిలో కొందరు ఈ మధ్యే కాలేజీ విద్యను పూర్తి చేసుకోగా.. ఒకరు ఇంకా చదువుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ పాలనా వ్యవహారాలకు సంబంధించిన ఎలాంటి అనుభవం లేని వీరిని డోజ్ ఉద్యోగులుగా నియమించడం అగ్రరాజ్యంలో చర్చనీయాంశంగా మారింది. అమెరికా ప్రభుత్వానికి సంబంధించి సున్నితమైన డేటాను తెలుసుకునేందుకు డోజ్కు అనుమతి ఉన్న నేపథ్యంలో ఈ యువ ఉద్యోగుల నియామకాలపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మెరుగైన చికిత్స కోసం విదేశాలకు శ్రీతేజ్! బన్నీవాసు కీలక నిర్ణయం
Samantha: సమంతతో ఆ డైరెక్టర్.. డేటింగ్ నిజమేనా?
ముద్దు కాదు కదా.. స్లీవ్ లెస్ డ్రెస్ కూడా వేయదు..
స్టార్ కొరియోగ్రాఫర్ దారుణం.. డ్రగ్స్ ఇచ్చి బాలికను గర్భవతిని చేశాడని ఆరోపణలు