శాంతిభద్రతలే ముఖ్యం.. దాదాగిరి ఇక నడవదు.. హైదరాబాద్ కొత్వాల్ స్ట్రాంగ్ వార్నింగ్..!

2 hours ago 1

హైదరాబాద్ మహానగరంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హైదరాబాద్ కొత్వాల్ సీవీ ఆనంద్ హెచ్చరించారు. అదనపు జిల్లా మేజిస్ట్రేట్ హోదాలో కార్యనిర్వాహక న్యాయస్థాన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో హుమాయున్ నగర్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌వో అందజేసిన సమాచారంపై సమీక్షించారు. ఇటీవల నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో చోటుచేసుకున్న రాజకీయ ప్రత్యర్థుల మధ్య జరిగిన ఉద్రిక్తతను సమీక్షించారు.

నాంపల్లి నియోజకవర్గంలో రాజకీయ వైరం

నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో AIMIM పార్టీకి చెందిన ఎమ్మెల్యే మహ్మద్ మజీద్ హుస్సేన్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మహ్మద్ ఫిరోజ్ ఖాన్ మధ్య తీవ్రమైన రాజకీయ వైరం నెలకొంది. ఈ రెండు నేతల రాజకీయ వ్యత్యాసాలు మరియు అనుచరుల మధ్య విభేదాలు బయటపడ్డాయి. ఈ నేపథ్యంతో నియోజకవర్గంలో శాంతి భద్రతలు తరచూ ప్రశ్నార్థకంగా మారాయి.

సంఘటన వివరాలు

కొద్ది రోజుల క్రితం మహ్మద్ మజీద్ హుస్సేన్ తన అనుచరులతో కలిసి ఫిరోజ్ గాంధీ నగర్‌లో సిసి రోడ్డుకు సంబంధించిన సివిల్ పనులను పరిశీలించేందుకు వెళ్లారు. అదే సమయంలో, కాంగ్రెస్ పార్టీకి చెందిన మహ్మద్ ఫిరోజ్ ఖాన్ కూడా తన అనుచరులతో అక్కడకు చేరుకున్నారు. ఇద్దరు నాయకుల మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుంది. ఇరువర్గాల అనుచరులు పరస్పర విరుద్ధంగా వ్యవహరించడం వలన ఆ ప్రాంతంలో ప్రజలలో భయాందోళనలు ఏర్పడ్డాయి, మరియు అక్కడి శాంతి భద్రతలు భంగం కలిగించాయి.

పోలీసుల జోక్యం

ఆ ప్రాంతంలోని పరిస్థితులు తీవ్రతరమవుతుండగా, హుమాయున్ నగర్ పోలీసులు ఇరువర్గాల కార్యకర్తలను చెదరగొట్టేందుకు దాడి చేశారు. శాంతి భద్రతలను పునరుద్ధరించేందుకు పోలీసులు తక్షణమే స్పందించి కఠిన చర్యలు తీసుకున్నారు. ఇరువర్గాలపై చట్టప్రకారం కేసు నమోదు చేశారు.

పోలీస్ కమిషనర్ సమీక్ష

ఈ సంఘటనపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌కు హుమాయున్ నగర్ ఎస్‌హెచ్‌వో సమర్పించిన సమాచారాన్ని సమీక్షించారు. ఎస్‌హెచ్‌వో నివేదిక ఆధారంగా, ఇరువర్గాల మధ్య తీవ్ర రాజకీయ వైరం ఉంది. వారి తప్పుడు చర్యలు భవిష్యత్తులో శాంతికి పెద్ద ముప్పుగా మారే అవకాశం ఉందని తెలియజేశారు. ఈ సమాచారంపై విచారణ చేపట్టిన కమిషనర్ ఇరువర్గాల ప్రతినిధులను వ్యక్తిగతంగా పిలిచి వారి వాదనలు విన్నారు. ఇరువర్గాల నాయకులు వారి వాదనలు విన్న కమిషనర్, ఇలాంటి రెచ్చగొట్టే చర్యల నుండి దూరంగా ఉండాలని కఠినంగా హెచ్చరించారు.

కోర్టు ఆదేశాలు

కోర్టు విచారణ అనంతరం, పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఈ కేసును తదుపరి విచారణకు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. కోర్టు ఆదేశాల ప్రకారం, ఎవరైనా వ్యక్తి లేదా సమూహం భవిష్యత్తులో శాంతి భద్రతలకు భంగం కలిగించే అవకాశం ఉంటే, వారికి షరతులతో కూడిన బాండ్ అమలు చేయాల్సి వస్తుందని సీపీ వార్నింగ్ ఇచ్చారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించగల వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీ ఆనంద్ నిర్ణయించారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా ఉండటానికి ఇరువర్గాలపై నిఘా ఉంచాలని కొత్వాల్ సూచించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article