అమరావతి 2.O వర్షన్ నడుస్తోందిప్పుడు. రాజధాని నిర్మాణ పనులను పునఃప్రారంభించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. తుళ్లూరు మండలం లింగాయపాలెం-ఉద్దండరాయినిపాలెం వద్ద 160 కోట్ల రూపాయలతో సీఆర్డీఏ కోసం జీ+7 బిల్డింగ్ పనులను 2017లో ప్రారంభించారు. దాదాపు ఏడేళ్ల గ్యాప్ తరువాత ఆ ప్రాజెక్ట్ పనులను మళ్లీ ప్రారంభించారు. ఈసారి పనులు ఆగడం కాదు.. టార్గెట్ లోపు పూర్తిచేయాలనే టార్గెట్ కూడా పెట్టారు.
ఈ క్రమంలోనే అమరావతి మీదుగా కొత్త రైల్వే లైన్కు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఎర్రుపాలెం, అమరావతి, నంబూరు మధ్య 57 కిలోమీటర్ల పొడవున కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి కేంద్ర గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాదాపు రూ. 2,245 కోట్లతో రైల్వే లైన్ నిర్మాణానికి నిధులు కేటాయిస్తూ మోదీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. అమరావతి ప్రగతికి రైల్వే ద్వారా పనుల వేగాన్ని పెంచింది. ప్రస్తుతం అమరావతికి వెళ్లే రైలు మార్గాన్ని రూపొందించేందుకు భారతీయ రైల్వే సంస్థ వేగంగా అడుగులు వేస్తోంది. ముఖ్యంగా ఎర్రుపాలెం, అమరావతి, నంబూరు మధ్య ప్రాంతాలలో రైలు మార్గానికి అవసరమైన భూమిని సేకరించాలని ఇప్పటికే రైల్వే శాఖ కార్యాచరణ మొదలు పెట్టింది. ఇప్పటికే గుంటూరు జిల్లాలోని 97 గ్రామాలలో భూసేకరణకు నోటిఫికేషన్ ఇవ్వటంతో భూసేకరణలో వేగం పుంజుకోనుంది. కొత్త రైల్వే లైన్ ద్వారా ప్రజలు ఆంధ్రప్రదేశ్లోని రాజధాని నగరం అమరావతికి సులభంగా ప్రయాణించేందుకు వీలవుతుంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..