AP TET 2024 Result Date: ఏపీ టెట్‌ పరీక్షలకు భారీగా తగ్గిన హాజరు.. ఫలితాలు ఎప్పుడంటే!

2 hours ago 1

అమరావతి, అక్టోబర్‌ 22: ఆంధ్రప్రదేశ్‌ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (టెట్‌) జులై పరీక్షలు అక్టోబరు 21తో ముగిశాయి. 17 రోజల పాటు రెండు విడతలుగా నిర్వహించిన ఈ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. రాష్ట్ర వ్యాప్తంగా టెట్‌ పరీక్షకు మొత్తం 4,27,300 మంది దరఖాస్తు చేయగా.. వారిలో 3,68,661 అంటే 86.28 శాతం మంది మాత్రమే ఆన్‌లైన్‌ పరీక్షలకు హాజరయ్యారు. సోమవారం జరిగిన చివరి పరీక్ష పేపర్‌ 2ఏ సోషల్ స్టడీస్‌, పేపర్‌ 2బీ ప్రత్యేక ఉపాధ్యాయ అర్హత పరీక్షల రెస్పాన్స్‌ షీట్లు, ప్రాథమిక ఆన్సర్‌ కీలను అక్టోబరు 23 నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామని కన్వీనర్‌ ఎంవీ కృష్ణారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. వీటిపై అభ్యంతరాలను ఆన్‌లైన్‌లో అక్టోబరు 25 వరకు స్వీకరించనున్నట్లు వెల్లడించారు. మొత్తం 17 రోజుల పాటు జరిగిన ఉపాధ్యాయ అర్హత పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని, రాష్ట్ర, జిలా స్థాయి అధికారులు, విద్యుత్, రవాణా, వైద్య, పొలీసు విభాగాల అధికారులు, సాంకేతిక నిపుణుల బృందం సమన్వయంతో పనిచేసి టెట్ పరీక్షలు విజయవంతంగా నిర్వహించారని కన్వీనర్ ఎంవీ కృష్ణారెడ్డి తెలిపారు.

ఇక చివరి రోజు పరీక్షలకు మొత్తం 11,877 మందికి గాను 9,844 మంది అభ్యర్థులు హాజరయ్యారు. అంటే మొత్తం మందిలో 82.88 శాతం మంది హాజరయ్యారన్నమాట. ఉదయం 38 సెంటర్లలో జరిగిన పేపర్ 2ఏ సోషల్‌ స్టడీస్‌ పరీక్షకు 9,441 మందికి గాను 7,886 మంది అంటే 83.53 శాతం మంది హాజరయ్యారు. అదేవిధంగా మధ్యాహ్నం 17 సెంటర్లలో జరిగిన పేపర్ 2బి ప్రత్యేక ఉపాధ్యాయ అర్హత పరీక్షలకు 2,436 మందికి గాను 1958 మంది అంటే 80.38 శాతం మంది హాజరయ్యారు

కాగా ఏపీలో 16,347 ఉపాధ్యాయ పోస్టులకు మెగా డిఎస్సీ నోటిఫికేషన్ జారీ చేస్తామని కూటమి సర్కార్‌ ఏర్పాటైన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు సంతకం చేయడంతో లక్షలాదిమంది నోటిఫికేషన్ కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. డీఎస్సీలో వీలైనంత ఎక్కువ మందికి అవకాశం కల్పించేందుకు మరోసారి టెట్‌ పరీక్షను కూడా నిర్వహించాలని నాడే ప్రకటించారు. ఈ మేరకు టెట్‌ పరీక్షను విజయవంతంగా పూర్తి చేశారు. ఏపీ టెట్‌ ఫలితాలు నవంబర్ 2వ తేదీన విడుదలవనున్నాయి. మెగా డిఎస్సీ నోటిఫికేషన్‌ నవంబర్ మొదటి వారంలో విడుదల కానుంది. నవంబరు 3న విడుదల చేసేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సమాయాత్తమవుతుంది. మెగా డీఎస్సీ మొత్తం పోస్టుల్లో సెకండరీ గ్రేడ్‌ టీచర్లు (ఎస్జీటీ) 6,371, స్కూల్‌ అసిస్టెంట్లు (ఎస్‌ఏ) 7,725, ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌ (టీజీటీలు) 1781, పోస్టు గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌ (పీజీటీలు) 286, ప్రిన్సిపల్స్‌ 52, వ్యాయామ ఉపాధ్యాయులు (పీఈటీలు) 132 పోస్టులను భర్తీ చేయనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article