Bomb Threats: పేలుడు ఘటన జరిగి మూడు రోజులు కాకముందే.. సీఆర్‌పీఎఫ్ పాఠశాలలకు బాంబు బెదిరింపులు

2 hours ago 1

న్యూఢిల్లీ, హైదరాబాద్‌లోని పలు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) పాఠశాలలకు మంగళవారం బాంబు బెదిరింపు ఈ మెయిల్‌లు రావడం కలకలం రేపుతుంది. న్యూ ఢిల్లీలోని రోహిణి ప్రశాంత్ విహార్ ప్రాంతంలోని CRPF పాఠశాల గోడ నుండి బలమైన పేలుడు సంభవించిన రెండు రోజుల తర్వాత ఇలా బెదిరింపులు రావడం సంచలనంగా మారింది.

 పేలుడు ఘటన జరిగి మూడు రోజులు కాకముందే.. సీఆర్‌పీఎఫ్ పాఠశాలలకు బాంబు బెదిరింపులు

Bomb Threats

|

Updated on: Oct 22, 2024 | 1:58 PM

న్యూఢిల్లీ, హైదరాబాద్‌లోని పలు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) పాఠశాలలకు మంగళవారం బాంబు బెదిరింపు ఈ మెయిల్‌లు రావడంతో ఆందోళన స్పష్టించింది. ఢిల్లీలోని రెండు పాఠశాలలు, హైదరాబాద్‌లోని ఒక పాఠశాల బెదిరింపుల లక్ష్యాలు వచ్చాయి. ఇవీ సోమవారం అర్థరాత్రి వచ్చినట్లు తెలుస్తుంది.

న్యూ ఢిల్లీలోని రోహిణి ప్రశాంత్ విహార్ ప్రాంతంలోని CRPF పాఠశాల గోడ నుండి బలమైన పేలుడు సంభవించిన రెండు రోజుల తర్వాత ఇలా బెదిరింపులు రావడం సంచలనంగా మారింది. మే నెలలో ఢిల్లీలోని 131 పాఠశాలలకు బాంబు బెదిరింపు ఇమెయిల్‌లు వచ్చినప్పుడు ఇలా వచ్చాయి. ఈమెయిల్స్‌లో ‘స్వరైమ్’ అనే పదం ఉంది. ఇది ఇస్లామిక్ స్టేట్ ఇస్లామిస్ట్ ప్రచారాన్ని ప్రోత్సహించడానికి ఉపయోగించే అరబిక్ పదం అని ఢిల్లీ పోలీసులు తెలిపారు. బెదిరింపులు బూటకమని ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MHA) ప్రకటన విడుదల చేసింది. ఢిల్లీ పోలీసులు, భద్రతా సంస్థలు ప్రోటోకాల్ ప్రకారం అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article