Fact: గురివింద వెనుక ఇంత కహానీ ఉందా.? బంగారాన్ని కొలిచేందుకు ఎందుకు ఉపయోగించేవారు

2 hours ago 2

గురివింద గింజ పేరు వినగానే మొదటగా గుర్తొచ్చే.. ‘గురివింద గింజ తన నలుపెరగదంట’ అనే ఈ సామెత గుర్తు రావడం సర్వసాధారణం. గురివింద పై భాగం మొత్తం ఎర్రగా ఉండి కింది భాగంలో మాత్రం నల్లగా ఉంటుంది. కానీ, ఆ నలుపు సంగతి ఎరుగక అది తనని తాను ఓ గొప్ప అందగత్తె నని భ్రమపడుతుంది. మనుషులు కూడా తమలోని తప్పులను తెలుసుకోలే ఇతరులను తప్పు పడతారన్న అర్థం వచ్చేలా ఈ సామెతను ఉపయోగిస్తారు.

అయితే గురివింద గింజల వెనకాల ఎంతో పెద్ద కథ ఉందని మీకు తెలుసా.? సాధారణంగా ఈ గింజలను బంగారాన్ని కొలిచేందుకు ఉపయోగిస్తుండం చూసే ఉంటాం. మరి ఈ గింజలను బంగారం బరువు కొలిచేందుకు ఎందుకు ఉపయోగిస్తారు.? అసలు ఈ గింజలు ఏ మొక్క నుంచి వస్తాయి.? లాంటి ఆసక్తికర విషయాలను ఓ నెటిజన్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ ఐడీలో వివరంగా తెలిపారు..

ఈ గింజలు గూంజ్‌ మొక్క నుంచి వస్తాయి. దీనిని సాధారణంగా రోసరీ బఠానీ అని కూడా పిలుస్తుంటారు. ఏడాది పొడవునా ఈ మొక్కలు విస్తృతంగా పెరుగుతుంటాయి. గురివింద గింజలను మొదట్లో బంగారాన్ని కొలిచేందుకు ఉపయోగించేవారు. దీనికి కారణం ఈ గింజలన్నీ దాదాపు ఒకే బరువలో ఉంటాయి. అందుకే వీటిని ప్రామాణికంగా తీసుకుంటారు. దేశంలో తొలిసారి బంగారం, వెండిని కొలిచేందుకు ఈ గింజలే ఉపయోగించేవారు. త్రాసులో ఒకవైపు గింజలు వేసి మరో వైపు బంగారాన్ని మెజర్ చేసేవారు.

ఈ గింజల బరువును రతిగా చెప్తుంటారు. ఒక రతి 1.5 మిల్లీగ్రాములతో సమానమైన బరువుతో ఉంటుంది. ఇక ఈ మొక్క ఆకులు కూడా ఎంతగానో ఉపయోగపడుతాయి. ఆకులను మనం తినే పాన్‌లలో ఉపయోగిస్తుంటారు. ముఖ్యంగా స్వీట్‌ పాన్స్‌లో రుచి రావడానికి వీటిని ఉపయోగిస్తారు. ఇదండీ మనకు తెలియకుండానే మన జీవితంలో భాగమైన గురివింద గింజలు, ఆ మొక్క వెనకాల ఉన్న చరిత్ర.

మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article