IND vs NZ: టీమిండియా ఓటమితో విలన్లుగా మారిన ఆ ఇద్దరు.. కట్‌చేస్తే.. వాళ్లు ఎప్పటికీ హీరోలేనన్న రోహిత్

2 hours ago 1

IND vs NZ: స్పిన్‌కు అనుకూలమైన పిచ్‌పై పేలవమైన ప్రదర్శన కారణంగా జట్టు 12 ఏళ్ల తర్వాత తొలిసారిగా స్వదేశంలో టెస్టు సిరీస్‌ను కోల్పోయింది. ఈ క్రమంలో రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాల స్పిన్ ద్వయాన్ని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ శనివారం సమర్థించాడు. పూణెలోని MCA స్టేడియంలోని స్పిన్‌కు అనుకూలమైన పిచ్‌లో భారత్ పూర్తిగా విఫలమైంది. టీమిండియా టాప్ స్పిన్నర్ల వైఫల్యం కారణంగా న్యూజిలాండ్ విజయం సాధించింది.

రోహిత్ శర్మ కీలక ప్రకటన..

రెండో టెస్టులో భారత్ 113 పరుగుల తేడాతో ఓటమి పాలైన తర్వాత, విలేకరుల సమావేశంలో భారత స్పిన్నర్ల ప్రదర్శన గురించి కెప్టెన్ రోహిత్ శర్మను విలేకర్లు ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘వారి గురించి అందరికి తెలుసు. ఈ ఇద్దరు ఆటగాళ్లపై భారీ అంచనాలు ఉన్నాయి. ఏ మ్యాచ్ ఆడినా వికెట్లు తీసి ప్రత్యర్థి జట్టుపై ఒత్తిడి పెంచి టెస్టు మ్యాచ్‌లో విజయం సాధించాలని భావిస్తున్నారు. అది సరైంది కాదని నా అభిప్రాయం’ అంటూ సమర్ధించాడు.

ఒక్కసారిగా విలన్‌లుగా మారిన ఇద్దరు..

2012-13లో ఇంగ్లండ్ చేతిలో ఓడిన తర్వాత స్వదేశంలో భారత్ వరుసగా 18 సిరీస్ విజయాలు శనివారంతో ముగిశాయి. 2011 నవంబర్‌లో అరంగేట్రం చేసిన అశ్విన్, డిసెంబర్ 2012లో తన తొలి టెస్టు ఆడిన జడేజా ప్రమాదకరమైన స్పిన్ జోడీగా ఈ కలల ప్రయాణాన్ని ప్రారంభించారు. సొంతగడ్డపై కలిసి ఆడుతున్న అశ్విన్ 55 టెస్టుల్లో 326 వికెట్లు తీయగా, జడేజా 47 మ్యాచ్‌ల్లో 225 వికెట్లు తీశాడు.

కెప్టెన్ రోహిత్ సపోర్ట్..

టెస్టు గెలవడం సమిష్టి బాధ్యత అంటూ రోహిత్ సమర్దించాడు. ‘ఇద్దరు ఆటగాళ్లే కాకుండా టెస్టు గెలవాల్సిన బాధ్యత మాఅందరిపైనా ఉంది. ఇద్దరూ ఇక్కడ చాలా క్రికెట్ ఆడారు. మా విజయానికి చాలా దోహదపడ్డారు. సొంతగడ్డపై 18 సిరీస్‌లు గెలవడంలో వీరిద్దరూ ప్రధాన పాత్ర పోషించారు’ అంటూ చెప్పుకొచ్చాడు.

‘కొన్ని మ్యాచ్‌ల్లో ఫలితాలు వేరేలా ఉంటాయ్’

ముఖ్యంగా ఈ ఇద్దరు ఆటగాళ్ల విషయంలో నేను పెద్దగా పట్టించుకోను. ఏమి జరిగిందో వారికి బాగా తెలుసు. కొన్నిసార్లు కొన్ని మ్యాచ్‌లు వారికి కూడా చెడుగా మారవచ్చు. 500, 300 కంటే ఎక్కువ వికెట్లు తీసిన ఆటగాళ్ల గురించి మాట్లాడుతున్నారు. ఎలా వికెట్లు తీయాలో, ప్రతిసారీ టెస్ట్ మ్యాచ్‌లను ఎలా గెలిపించాలో వాళ్లకు బాగా తెలుసు. కానీ, కొన్ని సందర్భాల్లో మన చేతుల్లో ఏం ఉండదు’ అంటూ రోహిత్ చెప్పుకొచ్చాడు.

‘వాళ్ల బౌలింగ్ పట్ల గర్వంగా ఉంది’

వాషింగ్టన్‌ సుందర్‌ బౌలింగ్‌ పట్ల గర్వంగా ఉందని రోహిత్‌ అన్నాడు. మూడేళ్లలో సుందర్ తొలి టెస్టులోనే 11 వికెట్లు పడగొట్టాడు. భారత్ తమ బౌలింగ్‌ను కచ్చితంగా విశ్లేషిస్తుంది. రోహిత్ మాట్లాడుతూ, ‘వాషి అద్భుతంగా ఆడాడు. నేను అతని ఆటను చూసి గర్వపడుతున్నాను. అతను కూడా గర్వపడుతున్నాడు. అతని పనితీరుతో మేం సంతోషిస్తున్నాం. అతను చాలా బాగా బౌలింగ్ చేశాడు’ అంటూ రోహిత్ తెలిపాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article