Jani Master Case: జానీ మాస్టర్ కేసులో మరో ట్విస్ట్.. ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌లో భార్య ఫిర్యాదు

2 hours ago 1

"జానీపై చేస్తోన్ ఆరోపణలు అన్నీ అవాస్తవం.. ఆ అమ్మాయే మమ్మల్ని వేధించింది.. తన టార్చర్ తట్టుకోలేక నేను సూసైడ్ అంటెప్ట్ చేశా" అంటూ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్‌కు జానీ మాస్టర్ భార్య సుమలత కంప్లైంట్ చేసింది.

 జానీ మాస్టర్ కేసులో మరో ట్విస్ట్.. ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌లో భార్య ఫిర్యాదు

Jani Master Wife

| Edited By: Ram Naramaneni

Updated on: Sep 28, 2024 | 10:18 AM

జానీమాస్టర్ కస్టడీ శనివారంతో ముగియనుంది. శనివారం జానీ మాస్టర్‌ను మధ్యాహ్నం విచారించనున్నారు నార్సింగి పోలీసులు. నాలుగు రోజుల కస్టడీ ముగియనుండటంతో మధ్యాహ్నం జానీమాస్టర్‌కు వైద్య పరీక్షలు నిర్వహించి.. కోర్టులో హాజరుపర్చనున్నారు. కస్టడీలో పోలీసుల ప్రశ్నలకు సమాధానాలు దాటవేశారు జానీ. బాధితురాలే తనను వేధించిందని చెప్పినట్టు సమాచారం. తాజాగా జానీ మాస్టర్ కేసులో కొత్త ట్విస్ట్ తెరపైకి వచ్చింది. జానీ మాస్టర్‌పై కంప్లైంట్ పెట్టిన యువతిపై ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్‌కు కొద్ది రోజుల క్రితం ఫిర్యాదు చేసింది జానీ మాస్టర్ భార్య సుమలత. కొరియోగ్రాఫర్‌గా పని కోసం తన భర్తను ట్రాప్ చేసి ప్రేమ పేరుతో పేధింపులకు గురి చేసినట్లు అందులో పేర్కొంది. ఐదు సంవత్సరాలుగా నరకం అంటే ఏంటో చూపించిందని.. ఆమె వేధింపుల తాళలేక తాను ఆత్మహత్యాయత్నం కూడా చేసినట్లు ఫిర్యాదులో పేర్కొంది. నాకు అమ్మ వద్దు.. నాన్న వద్దు.. నువ్వు పెళ్లి చేసుకో అంటూ జానీ మాస్టర్‌ని ఆ అమ్మాయి తీవ్ర ఒత్తిడికి గురిచేసినట్లు ఫిర్యాదులో జానీ భార్య సుమలత వెల్లడించింది.

“నా భర్త జానీ మాస్టర్‌ను ఇంటికి రాకుండా ఆ యువతి అడ్డుకునేది. కేవలం 2 నుంచి 3 గంటలు మాత్రమే ఇంటికి పంపేది. బాధితురాలు ఇంటికి వెళ్లి జానీ మాస్టర్‌ను నువ్వు ఇష్టపడితే ఆయన జీవితం నుంచి నేను వెళ్ళిపోతాను అని చెప్పాను. అప్పుడు మాస్టర్ నాకు అన్నయ్య లాంటివాడు మీరు నాకు వదిన అంటూ నమ్మించింది. నా భర్తతో కాకుండా చాలామంది మగవాళ్ళతో ఆమెకు అక్రమ సంబంధం ఉంది. ఇవన్నీ తెలుసుకున్న జానీ మాస్టర్ ఆ అమ్మాయిని దూరం పెట్టాడు. దీంతో కక్ష కట్టి తన పైన లైంగిక దాడి చేశాడు అంటూ అక్రమ కేసు పెట్టింది. పేరున్న డబ్బున్న మగవారిని టార్గెట్ చేసి ఆమె ఇలా వేధింపులకు గురిచేస్తుంది. ఆ అమ్మాయితో పాటు ఆమె తల్లి కూడా ఇబ్బందులకు గురి చేసింది. ఆమె పెట్టిన అక్రమ కేసు ఆరోపణలపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. నాకు, నా పిల్లలకు ఏం జరిగినా ఆ తల్లి కూతుళ్ళదే బాధ్యత. నాకు, నా బిడ్డలకు న్యాయం చేయాలని కమిటీని కోరుకుంటున్నాను” అని ఫిర్యాదులో సుమలత పేర్కొంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article