Pesara Flour : పెసర పిండితో ఇలా చేస్తే ముఖంపై జిడ్డు, మృతకణాలు మాయం..! అదిరి పోయే అందం మీ సొంతం..

2 hours ago 1

మెరిసే చర్మంతో అందంగా కనిపించాలని అందరూ కోరుకుంటారు. అందుకు చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేస్తుంటారు. చాలా మంది తమ చర్మ సౌందర్యం కోసం ఎన్నో రకాల కాస్ట్లీ సోపులు, క్రీములు ఫేస్ వాష్‌లు అంటూ వినియోగిస్తూ ఉంటారు. అయితే వీటిలో ఎంతో కొంత రసాయనాలు ఉండటం వలన చర్మానికి హాని చేస్తాయి. కాబట్టి సహజ పదార్థాలతోనే చర్మ సౌందర్యాన్ని మెరుగు పర్చుకోవడానికి ప్రయత్నించాలంటున్నారు కొందరు నిపుణులు.

|

Updated on: Oct 27, 2024 | 12:45 PM

మన వంటింట్లో లభించే సహజ సిద్ధమైన పదార్థాలు మన చర్మ సౌందర్యాన్ని పెంచడమే, చర్మం ఎంతో ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. ఇందులో పెసలు మన చర్మ సౌందర్యాన్ని పెంచడంలో చక్కగా పని చేస్తుందని చెబుతున్నారు. చర్మానికి ఇది చేసే మేలు అంతా ఇంతా కాదు.

మన వంటింట్లో లభించే సహజ సిద్ధమైన పదార్థాలు మన చర్మ సౌందర్యాన్ని పెంచడమే, చర్మం ఎంతో ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. ఇందులో పెసలు మన చర్మ సౌందర్యాన్ని పెంచడంలో చక్కగా పని చేస్తుందని చెబుతున్నారు. చర్మానికి ఇది చేసే మేలు అంతా ఇంతా కాదు.

1 / 5

చర్మాన్ని మృదువుగా చేయడంలోనూ, చర్మానికి మెరుపును ఇవ్వడంలోనూ, చక్కటి రంగు తేలేలా చేయడం లోనూ పెసర్లు చక్కగా పని చేస్తాయి. ఇందుకోసం కొద్దిగా పెసరపప్పు తీసుకుని బాగా ఎండబెట్టి పొడిలా చేసుకుని నిలువ చేసుకోవాలి. దీనిని ఫేస్ ప్యాక్ లాగా వేసుకోవాలి అనుకున్నప్పుడల్లా ఆ పెసరపిండిని వినియోగించుకోవచ్చు.

చర్మాన్ని మృదువుగా చేయడంలోనూ, చర్మానికి మెరుపును ఇవ్వడంలోనూ, చక్కటి రంగు తేలేలా చేయడం లోనూ పెసర్లు చక్కగా పని చేస్తాయి. ఇందుకోసం కొద్దిగా పెసరపప్పు తీసుకుని బాగా ఎండబెట్టి పొడిలా చేసుకుని నిలువ చేసుకోవాలి. దీనిని ఫేస్ ప్యాక్ లాగా వేసుకోవాలి అనుకున్నప్పుడల్లా ఆ పెసరపిండిని వినియోగించుకోవచ్చు.

2 / 5

రెండు టీ స్పూన్ల పెసరపప్పు పొడిని తీసుకొని అందులో కాస్త పసుపు వేసుకోవాలి. అందులో కావాల్సినంతా మోతాదులో పచ్చిపాలను కలుపుకుంటూ మెత్తటి పేస్ట్ లా తయారు చేసుకోవాలి. ఇపుడు ఆ మిశ్రమాన్ని ఫేస్ ప్యాక్‌లా ముఖానికి అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత పదిహేను ఇరవై నిమిషాలకు ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి... ఇలా వారానికి రెండు మూడు సార్లు చేయడం వలన చక్కటి ఫలితాలను పొందగలరు.

రెండు టీ స్పూన్ల పెసరపప్పు పొడిని తీసుకొని అందులో కాస్త పసుపు వేసుకోవాలి. అందులో కావాల్సినంతా మోతాదులో పచ్చిపాలను కలుపుకుంటూ మెత్తటి పేస్ట్ లా తయారు చేసుకోవాలి. ఇపుడు ఆ మిశ్రమాన్ని ఫేస్ ప్యాక్‌లా ముఖానికి అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత పదిహేను ఇరవై నిమిషాలకు ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి... ఇలా వారానికి రెండు మూడు సార్లు చేయడం వలన చక్కటి ఫలితాలను పొందగలరు.

3 / 5

మూడు టీ స్పూన్ల పెసరపిండి, ఒక టీ స్పూను బియ్యప్పిండి, కొద్దిగా పసుపు వేసి దానికి రోజ్ వాటర్ కలిపి మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి. తర్వాత ఆ పేస్ట్ ను ముఖానికి అప్లై చేసుకుంటూ బాగా మసాజ్ చేయాలి. ఇలా చేయడం వలన చర్మ రంధ్రాలోని మురికి, బ్యాక్టీరియా పోయి చర్మం కాంతి వంతంగా కనిపిస్తుంది.

మూడు టీ స్పూన్ల పెసరపిండి, ఒక టీ స్పూను బియ్యప్పిండి, కొద్దిగా పసుపు వేసి దానికి రోజ్ వాటర్ కలిపి మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి. తర్వాత ఆ పేస్ట్ ను ముఖానికి అప్లై చేసుకుంటూ బాగా మసాజ్ చేయాలి. ఇలా చేయడం వలన చర్మ రంధ్రాలోని మురికి, బ్యాక్టీరియా పోయి చర్మం కాంతి వంతంగా కనిపిస్తుంది.

4 / 5

చర్మం బరకగా కనిపిస్తుంటే ఇబ్బందిగా ఉంటుంది. అలాంటప్పుడు కప్పు పెసర పిండిలో చెంచా నిమ్మరసం, చెంచా ఆలివ్ నూనె కలిపి ఆ మిశ్రమాన్ని ఒంటికి పట్టించి నలుగులా రుద్దుకోవాలి. ఇలా రోజూ చేస్తుంటే మృతకణాలు తొలగి చర్మం నునుపుగా మారుతుంది.

చర్మం బరకగా కనిపిస్తుంటే ఇబ్బందిగా ఉంటుంది. అలాంటప్పుడు కప్పు పెసర పిండిలో చెంచా నిమ్మరసం, చెంచా ఆలివ్ నూనె కలిపి ఆ మిశ్రమాన్ని ఒంటికి పట్టించి నలుగులా రుద్దుకోవాలి. ఇలా రోజూ చేస్తుంటే మృతకణాలు తొలగి చర్మం నునుపుగా మారుతుంది.

5 / 5

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article