అమెరికాలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన బిజీబిజీగా కొనసాగుతోంది. రెండో రోజు పలు కార్యక్రమాలకు ఆయన హాజరయ్యారు. న్యూయార్క్లో 'మోదీ అండ్ యూఎస్ ప్రోగ్రెస్ టుగెదర్' కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు. అంతేకాకుండా.. వ్యాపార, టెక్ దిగ్గజాలతో ప్రధాని మోదీ భేటీ అయ్యారు.
PM Modi - Nvidia CEO Jensen Huang
అమెరికాలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన బిజీబిజీగా కొనసాగుతోంది. రెండో రోజు పలు కార్యక్రమాలకు ఆయన హాజరయ్యారు. న్యూయార్క్లో ‘మోదీ అండ్ యూఎస్ ప్రోగ్రెస్ టుగెదర్’ కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు. అంతేకాకుండా.. వ్యాపార, టెక్ దిగ్గజాలతో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ప్రత్యేకంగా చర్చించారు. న్యూయార్క్లో జరిగిన రౌండ్టేబుల్ కాన్ఫరెన్స్ లో ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ కూడా పాల్గొన్నారు. రౌండ్టేబుల్ కాన్ఫరెన్స్లో ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన అనంతరం ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ అద్భుతమైన విద్యార్థి అంటూ ప్రశంసించారు..
ప్రధాని మోదీ నిత్య విద్యార్థి అని.. తాను అతనిని కలిసిన ప్రతిసారీ, అతను సాంకేతికత గురించి మరింత తెలుసుకోవాలనుకుంటారని పేర్కొన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక కొత్త పరిశ్రమ అని.. తాను భారతదేశంతో లోతైన మార్గంలో భాగస్వామిగా ఉండటానికి ఎదురుచూస్తున్నానని పేర్కొన్నారు. మేము భారతదేశంలోని అనేక కంపెనీలు, స్టార్టప్లు, IITలతో భాగస్వామ్యం కోసం ఎదురుస్తున్నామని తెలిపారు. AI నిజంగా కంప్యూటింగ్ను ప్రజాస్వామ్యం చేస్తుంది.. అవకాశాలను అందిస్తుంది.. ఇది భారతదేశ శకం.. అద్భుతమైన అవకాశాలను అందిస్తుందని తెలిపారు. అంతా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలంటూ ప్రపంచ టెక్ సంస్థలకు సూచించారు.
వీడియో చూడండి..
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.