Spam Calls: ఇక స్పామ్‌ కాల్స్‌ అడ్డుకట్టకు కేంద్రం సంచలన నిర్ణయం.. సరికొత్త ట్రాకింగ్‌ సిస్టమ్‌ ప్రారంభం!

2 hours ago 1

భారతీయ ఫోన్ నంబర్‌లకు వచ్చే అంతర్జాతీయ కాల్‌లను గుర్తించి బ్లాక్ చేయడానికి కొత్త స్పామ్ ట్రాకింగ్ సిస్టమ్‌ను ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. సిస్టమ్ యాక్టివేట్ చేసింది. యాక్టివేషన్ అయిన 24 గంటలలోపే దాదాపు 1.35 కోట్లు లేదా భారతీయ ఫోన్ నంబర్‌లకు వచ్చిన మొత్తం అంతర్జాతీయ కాల్‌లలో 90 శాతం స్పామ్‌ కాల్స్‌ను గుర్తించారు. దీని తరువాత వారు టెలికాం సర్వీస్ ప్రొవైడర్స్ (TSPs) ద్వారా భారతీయ టెలికాం వినియోగదారులకు చేరుకోకుండా నిరోధించింది. ‘ఇంటర్నేషనల్ ఇన్‌కమింగ్ స్పామ్డ్‌ కాల్స్ ప్రివెన్షన్ సిస్టమ్’ను ప్రారంభించిన కేంద్ర సమాచార శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మాట్లాడుతూ.. సురక్షితమైన డిజిటల్ టెక్నాలజీని సృష్టించడం, సైబర్ నేరాల నుండి ప్రజలను రక్షించడం కోసం ప్రభుత్వం చేస్తున్న మరో ప్రయత్నం ఇది అని అన్నారు.

ఈ వ్యవస్థ అమలుతో భారతీయ టెలికాం వినియోగదారులు +91 నంబర్ నుండి ఇటువంటి నకిలీ కాల్‌లలో గణనీయమైన తగ్గింపును చూస్తారని అన్నారు. సైబర్ నేరగాళ్లు భారతీయ మొబైల్ నంబర్ (+91)ను వాడుతూ అంతర్జాతీయ నకిలీ కాల్‌లు చేస్తూ నేరాలకు పాల్పడుతున్నారు. ఈ కాల్‌లు భారతదేశంలో నుండి వస్తున్నట్లు కనిపిస్తున్నాయి. కానీ వాస్తవానికి కాలింగ్ లైన్ ఐడెంటిటీ (CLI) లేదా సాధారణంగా ఫోన్ నంబర్ అని పిలవబడే వాటిని మార్చడం ద్వారా విదేశాల నుండి చేస్తున్నారని మంత్రి అన్నారు. నేరగాళ్లు +91 కోడ్‌ వచ్చేలా విదేశాల నుంచి స్పామ్‌ కాల్స్‌ చేస్తున్నారని గుర్తించినట్లు ఆయన వెల్లడించారు.

ఇది కూడా చదవండి: Diwali 2024: దీపావళి అక్టోబర్‌ 31న లేదా నవంబర్‌ 1న.. బ్యాంకులకు సెలవు ఎప్పుడు? ఇదిగో క్లారిటీ!

ఈ నకిలీ కాల్‌లు ఆర్థిక మోసాలకు, ప్రభుత్వ అధికారులను అనుకరిస్తూ భయాందోళనలకు గురిచేస్తున్నారని, ఫోన్‌లో మాట్లాడుతూనే వినియోగదారుల పూర్తి వివరాలు తెలుసుకుని మోసాలకు పాల్పడుతున్నారన్నారు. సైబర్ క్రైమ్ కేసులు కూడా DoT/TRAI అధికారులు మొబైల్ నంబర్‌లను బ్లాక్ చేస్తామని బెదిరించడం, నకిలీ డిజిటల్ అరెస్ట్‌లు, కొరియర్‌లలో డ్రగ్స్/నార్కోటిక్స్, పోలీసు అధికారులను అనుకరిస్తూ మోసం చేయడం, సెక్స్ రాకెట్‌లో అరెస్ట్ చేయడం మొదలైన కేసులు కూడా వెలుగులోకి వచ్చాయన్నారు.

డిపార్ట్‌మెంట్ ఆఫ్ కమ్యూనికేషన్స్ (DOT), టెలికాం సర్వీస్ ప్రొవైడర్‌లు సంయుక్తంగా ఒక వ్యవస్థను అభివృద్ధి చేశాయని, దీని కింద ఇటువంటి మోసపూరిత అంతర్జాతీయ కాల్‌లు గుర్తిస్తున్నారు. భారతీయ టెలికాం వినియోగదారులకు చేరకుండా నిరోధిస్తున్నట్లు చెప్పారు.

ఇది కూడా చదవండి: Reliance: చివరి దశకు చేరుకున్న మరో భారీ ఒప్పందం.. రిలయన్స్‌కు సీసీఐ షరతు.. అదేంటంటే..

అయితే మోసగాళ్లు ఇతర మార్గాల ద్వారా కూడా మోసాలకు పాల్పడే అవకాశం ఉందని, అలాంటి కాల్‌ల కోసం సంచార్ సాథీలోని చక్ష్ ఫీచర్‌లో ఇటువంటి అనుమానిత మోసపూరిత కమ్యూనికేషన్‌లను నివేదించడం ద్వారా మీరు సహాయం చేయవచ్చు అని ప్రభుత్వం పేర్కొంది. సైబర్ మోసం నుండి ప్రజలను రక్షించడానికి టెలికమ్యూనికేషన్స్ విభాగం తీసుకున్న మరో అడుగు ఇది. సిస్టమ్ ఇన్‌కమింగ్ అంతర్జాతీయ కాల్‌లను గుర్తించి బ్లాక్ చేస్తుంది.

ఇది కూడా చదవండి: Indian Railway: రైలులో బెడ్‌షీట్లు, దిండ్లు, దుప్పట్లు నెలకు ఎన్నిసార్లు ఉతుకుతారు? రైల్వేశాఖ సమాధానం వింటే షాకవుతారు!

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article