Tax Saving Investments: వృద్ధులకు బెస్ట్ పెట్టుబడి పథకాలు ఇవి.. ప్రభుత్వ భద్రత, పైగా పన్ను రహితం..

2 hours ago 2

జీవితంలో పొదుపు అనేది చాలా అవసరం. ప్రతి ఒక్కరూ పొదుపు పాటించాలి. అదే సమయంలో పొదుపు చేసిన మొత్తాన్ని ఏదైనా మంచి పెట్టుబడి పథకంలో ఇన్వెస్ట్ చేయాలి. అప్పుడే ఆ పొదుపు సార్థకత వస్తుంది. ముఖ్యంగా సీనియర్ సిటిజెన్స్ దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించాలి. ఎందుకంటే వారికి పరిమిత ఆదాయ వనరులు ఉంటాయి. కేవలం పింఛన్ పైనే ఆధారపడాల్సి ఉంటుంది. పైగా ఆసమయంలో వారికి ఖర్చులు కూడా ఎక్కువగా ఉంటాయి. వారి రోజువారీ అవసరాలతో పాటు ఆస్పత్రి, మందుల ఖర్చులు పెరుగుతాయి. ఈ క్రమంలో మంచి రాబడినిచ్చే పథకాలలో పెట్టుబడి పెట్టడం మంచి నిర్ణయం. అయితే పెడుతున్న పెట్టుబడికి అధిక రాబడి రావడంతో పాటు దానిపై పన్ను ప్రయోజనాలు కూడా ముఖ్యం. అందుకే మీకు పన్ను ప్రయోజనాలను అందించే బెస్ట్ పథకాలను పరిచయం చేస్తున్నాం. ప్రభుత్వ మద్దతుతో నడిచే పథకాలు కాబట్టి మీ పెట్టుబడికి భద్రత, భరోసా కూడా ఉంటుంది.

సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ (ఎస్సీఎస్ఎస్)..

ఇది ప్రభుత్వ-మద్దతుగల పెట్టుబడి పథకం. సీనియర్ సిటిజన్‌లు తమ పొదుపులను పెంచుకోవడానికి సురక్షితమైన, నమ్మదగిన మార్గం ఇది. వడ్డీ రేటును ఆర్బీఐ ద్రవ్య ప్రణాళిక కమిటీ ప్రతి త్రైమాసికానికి సమీక్షిస్తుంది.ఈ పథకంలో ప్రస్తుతం ఏడాదికి 8.2శాతం వడ్డీ వస్తుంది.

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్)

ఈ పథకం15 ఏళ్ల లాక్-ఇన్ పీరియడ్‌తో దీర్ఘకాలిక, ప్రభుత్వ మద్దతు గల పథకం. పన్ను ప్రయోజనాలు, మూలధన రక్షణను అందిస్తుంది. సంపాదించిన వడ్డీ పన్ను రహితం. పన్ను ప్రయోజనాలు, దీర్ఘకాలిక వృద్ధితో తక్కువ-రిస్క్ కోరుకునే పెట్టుబడిదారులకు పీపీఎఫ్ అనుకూలంగా ఉంటుంది. పదవీ విరమణ కార్పస్‌ను నిర్మించడానికి లేదా భవిష్యత్తు కోసం పొదుపు చేయడానికి ఇది మంచి ఎంపిక. ప్రస్తుతం ఏడాదికి 7.1శాతం వడ్డీ అందిస్తోంది.

ఫిక్స్‌డ్ డిపాజిట్లు..

వివిధ పదవీకాల ఎంపికలతో బ్యాంకులు, పోస్టాఫీసులు, ఇతర ఆర్థిక సంస్థలు ఈ ఎఫ్డీలను నిర్వహిస్తాయి. ఇవి హామీతో కూడిన రాబడి, లిక్విడిటీని అందిస్తాయి. వడ్డీ ఆదాయం పన్ను పరిధిలోకి వస్తుంది. కానీ బ్యాంకులు తరచుగా సీనియర్ సిటిజన్లకు అధిక రేట్లను అందిస్తాయి. అయితే ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 80సీ కింద ఆదాయపు పన్ను మినహాయింపును క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంటుంది. మీరు రూ. 1.5 లక్షల వరకు పెట్టుబడులపై పన్ను ప్రయోజనాలను పొందవచ్చు. ఇది ఐదేళ్ల లాక్-ఇన్ పీరియడ్‌తో వస్తుంది. సీనియర్ సిటిజన్లు కూడా నిర్దిష్ట పన్ను ప్రయోజనాలను పొందుతారు. దీనిపై వడ్డీ రేటు బ్యాంకును బట్టి 8 నుంచి 8.5శాతం వరకూ ఉంటుంది. సీనియర్ సిటిజెన్స్ కు మరో 50బీపీఎస్ ఎక్కువగా ఉంటుంది.

ప్రభుత్వ బాండ్లు..

ప్రభుత్వం జారీ చేసే దీర్ఘకాలిక బాండ్లు భద్రతను, స్థిరమైన రాబడిని అందిస్తాయి. నిర్దిష్ట బాండ్ స్కీమ్‌పై ఆధారపడి పన్ను రహిత వడ్డీ లేదా ఇతర ప్రయోజనాలు లభిస్తాయి. దీనిపై వడ్డీ రేటు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. సాధారణంగా సంవత్సరానికి 7 నుంచి 8శాతం వరకూ ఉంటుంది.

నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్)

పన్ను ప్రయోజనాలతో దీర్ఘకాల పదవీ విరమణ పొదుపు కోసం రూపొందించిన పథకం ఇది. పదవీ విరమణ తర్వాత పెన్షన్ అందిస్తుంది. పెట్టుబడి ప్రధానంగా ఈక్విటీ, కార్పొరేట్ బాండ్‌లు, ప్రభుత్వ సెక్యూరిటీల మిశ్రమంలో ఉంటుంది. యాన్యుటీని కొనుగోలు చేయడానికి కార్పస్‌లో కొంత భాగాన్ని తప్పనిసరిగా ఉపయోగించాలి. ఇది పన్ను విధించబడుతుంది. దీనిపై వడ్డీ రేటు 8 నుంచి 12శాతం వరకూ మార్కెట్ పరిస్థితులకు లోబడి ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article