క్షిపణుల దాడితో దద్దరిల్లుతున్న పశ్చిమాసియా.. బిక్కు బిక్కుమంటున్న రెండు దేశాల జనం..!

2 hours ago 1

లెబనాన్‌పై విరుచుకుపడుతోంది ఇజ్రాయిల్‌. గత ఏడాది అక్టోబర్‌ 7న ఇజ్రాయెల్‌పై హమాస్‌ దాడి చేసింది. ఈ దాడికి ప్రతీకారంగా అదే రోజు లెబనాన్‌పై క్షిపణుల వర్షం కురిపించింది. దీంతో దక్షిణ లెబనాన్‌ ప్రాంతం మిస్సైల్‌ దాడులతో దద్దరిల్లిపోయింది. ఇజ్రాయెల్ సోమవారం 130 యుద్ధ విమానాలతో లెబనాన్‌పై దాడి చేసింది. లెబనాన్‌లోని 120 కంటే ఎక్కువ హిజ్బుల్లా స్థానాలను లక్ష్యంగా చేసుకున్నట్లు పేర్కొంది. అదే సమయంలో, హిజ్బుల్లా ఇజ్రాయెల్‌పై 130 రాకెట్లను కూడా ప్రయోగించారు. హమాస్, హిజ్బుల్లాకు వ్యతిరేకంగా జరుగుతున్న యుద్ధానికి ‘ది వార్ ఆఫ్ రివైవల్’ అని పేరు పెట్టాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కోరారు. గతంలో ఇజ్రాయెల్ , హమాస్ మధ్య గత ఏడాది కాలంగా జరుగుతున్న యుద్ధానికి ‘ఇనుప కత్తులు’ అని పేరు పెట్టింది.

లెబనాన్‌పై క్షిపణుల వర్షం కురిపిస్తోంది ఇజ్రాయెల్‌. హెజ్‌బొల్లా స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్‌ సేనలు విరుచుకుపడుతున్నాయి. దీంతో లెబనాన్‌ దక్షిణ భాగం మొత్తం ధ్వంసమైంది. ఎక్కడ చూసినా బాంబు దాడులకు ధ్వంసమైన భవనాలే దర్శనమిస్తున్నాయి. గత ఏడాది అక్టోబర్‌ 7న హమాస్‌, ఇజ్రాయెల్‌పై దాడి చేసింది. ఈ దాడిలో దాదాపు 1200 మంది ఇజ్రాయెల్ పౌరులు చనిపోయారు. అంతే కాకుండా, 250 మందికి పైగా ఇజ్రాయెల్ పౌరులు ఇజ్రాయెల్‌కు బందీలుగా ఉన్నారు. ఈ దాడి జరిగిన కొద్ది గంటలకే ఇజ్రాయెల్ హమాస్‌పై యుద్ధం ప్రకటించింది. ఈ దాడికి ప్రతీకారంగా అదే రోజున లెబనాన్‌లోని హెజ్‌బొల్లా స్థావనాలపై బాంబుల వర్షం కురిపించింది ఇజ్రాయెల్‌. కేవలం గంట వ్యవధిలో 120 హెజ్‌బొల్లా స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది ఇజ్రాయెల్‌ సైన్యం. క్షిపణుల వర్షం కురిపించింది. దీంతో సౌత్‌ లెబనాన్‌ మిస్సైల్‌ దాడులతో దద్దరిల్లిపోయింది. గత ఏడాది కాలంగా జరుగుతున్న ఈ యుద్ధం కారణంగా గాజాలో 40 వేల మందికి పైగా మరణించారు.

బీరూట్‌లోని పర్వత ప్రాంతాల్లో ఉన్న భవనాలను టార్గెట్ చేసింది ఇజ్రాయెల్‌. అక్కడ హెజ్‌బొల్లా కీలక నేతలు ఉన్నారనే సమాచారంలో బాంబుల వర్షం కురిపించింది. కేవలం ఒక్క భవనంలోనే పది మంది చనిపోయారంటే దాడుల ప్రభావం ఎంత తీవ్రంగా ఉందో తెలుస్తోంది. యెమెన్ నుండి బాలిస్టిక్ క్షిపణులతో కూడా ఇజ్రాయెల్ దాడి చేసింది. దాడికి ఉపరితలం నుంచి ఉపరితల క్షిపణిని ఉపయోగించారు. అయితే, ఇజ్రాయెల్ ఆర్మీ ప్రకారం, వారి వైమానిక రక్షణ క్షిపణిని గాలిలో కూల్చివేసింది. క్షిపణి దాడి గురించి సమాచారం అందిన వెంటనే, ఇజ్రాయెల్ అంతటా హెచ్చరిక సైరన్లు మోగడం ప్రారంభించాయి.

అయితే పర్వత ప్రాంతంలో ఉన్న ఇక్కడ హెజ్‌బొల్లా కీలక నేతలు ఉన్నారనే సమాచారంతో ఇజ్రాయెల్‌ దాడులు జరిపింది. ఈ దాడుల్లో 10 మంది చనిపోయి ఉంటారని భావిస్తున్నారు. ఇందులో నలుగురు చిన్నపిల్లలు కూడా ఉన్నారు. ఇజ్రాయెల్‌ జరిపిన దాడులతో ఈ ప్రాంతం భీతావహంగా మారిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (IDF) సోమవారం గాజా స్ట్రిప్, వెస్ట్ బ్యాంక్, లెబనాన్‌లలో నిర్వహించిన కార్యకలాపాలకు సంబంధించిన డేటాను విడుదల చేసింది. దీని ప్రకారం గతేడాది ఇజ్రాయెల్ పై 26 వేలకు పైగా క్షిపణులు, రాకెట్లు, డ్రోన్లు ప్రయోగించారు. గాజా, లెబనాన్, సిరియా, హౌతీ, ఇరాన్ దేశాల నుంచి ఈ దాడులు జరిగాయి. ఇరాక్ ఎన్ని దాడులు చేసిందన్న సమాచారం ఇవ్వలేదు.

IDF గాజా స్ట్రిప్‌లో సుమారు 17 వేల మంది హమాస్ సభ్యులను చంపింది. ఇజ్రాయెల్‌లో కూడా 1000 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. ఇజ్రాయెల్‌పై దాడిలో ఇప్పటివరకు 728 మంది సైనికులు మరణించారు. అదే సమయంలో, 4,576 మంది గాయపడ్డారు. గాజాలో భూసేకరణలో 346 మంది మరణించారు. అదే సమయంలో, గ్రౌండ్ ఆపరేషన్ సమయంలో 2,299 మంది సైనికులు గాయపడ్డారు.

ఇక తాజాగా అక్టోబర్‌ 7న జరిగిన మిస్సైల్‌ దాడులతో లెబనాన్‌లో ప్రాణనష్టంతో పాటు ఆస్తి నష్టం కూడా భారీగా జరిగింది. దీంతో ఎప్పుడు? ఎక్కడ? బాంబ్‌ పేలుతుంతోనని.. అక్కడి జనం భయంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article