ఆంధ్రప్రదేశ్లో అక్టోబరు 11 వరకు మద్యం షాపుల దరఖాస్తుల గడువును పొడగించినట్లు అబ్కారీ శాఖ సంచాలకులు నిషాంత్ కుమార్ తెలిపారు. అన్లైన్తో సహా అన్ని విధానాలలో దరఖాస్తులకు 11వ తేదీ సాయంత్రం 7 గంటల వరకు అవకాశం ఇవ్వనున్నట్లు చెప్పారు.
Ap News
ఆంధ్రప్రదేశ్లో అక్టోబరు 11 వరకు మద్యం షాపుల దరఖాస్తుల గడువును పొడగించినట్లు ఏపీ అబ్కారీ శాఖ సంచాలకులు నిషాంత్ కుమార్ తెలిపారు. అన్లైన్తో సహా అన్ని విధానాలలో దరఖాస్తులకు 11వ తేదీ సాయంత్రం 7 గంటల వరకు అవకాశం ఇవ్వనున్నట్లు చెప్పారు. అక్టోబరు 12,13 తేదీలలో దరఖాస్తుల పరిశీలించనున్నట్లు వెల్లడించారు. 14వ తేదీన అయా జిల్లాలలో కలెక్టర్ల పర్యవేక్షణలో మద్యం షాపుల కోసం లాటరీ తీయనున్నట్లు పేర్కొన్నారు. అదే రోజు కేటాయింపు ప్రకియ కూడా పూర్తి చేస్తామన్నారు. అక్టోబరు 16 వ తేదీ నుంచి నూతన మద్యం విధానాన్ని అనుసరించి ప్రైవేటు మద్యం షాఫులు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. ఇప్పటివరకు 50 వేలకు పైగా మద్యం షాపుల దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తుంది. దరఖాస్తు ఫీజ్ రూపంలో ప్రభుత్వానికి 1000 కోట్ల అదాయం సమకూరినట్లు తెలుస్తుంది.