స్వదేశంలో భారత్తో టెస్ట్ సిరీస్ అంటేనే.. ప్రత్యర్ధులకు ముచ్చెమటలే.! బంగ్లాదేశ్పై టెస్ట్ సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా.. కివీస్ను కూడా మట్టికరిపిస్తుందని అందరూ అనుకున్నారు. గత 12 ఏళ్లలో సొంతగడ్డపై ఓటమి ఎరగని భారత జట్టుకు.. న్యూజిలాండ్ టీం చుక్కలు చూపించింది. బెంగళూరు, పూణే టెస్టుల్లో వరుస విజయాలు అందుకుని.. రోహిత్ సేనకు జలక్ ఇచ్చింది. పూణే వేదికగా జరిగిన రెండో టెస్టులో కివీస్ 113 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది.
అనూహ్యంగా జట్టులోకి వచ్చిన మిచెల్ శాంట్నర్(13/157) కివీస్కు భారత గడ్డపై తొలి విజయాన్ని అందించాడు. 359 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో రోహిత్ సేన.. నాలుగో ఇన్నింగ్స్లో 245 పరుగులకు ఆలౌట్ అయింది. కీలక బ్యాటర్లు అయిన గిల్, రోహిత్, పంత్, కోహ్లీ తక్కువ పరుగులకే పెవిలియన్ చేరగా.. జైస్వాల్(77), జడేజా(42) టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఇక ఈ వరుస ఓటములు డబ్ల్యూటీసీ 2023-25 సైకిల్లో భారత్కు ఊహించని షాక్ ఇచ్చాయి. డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే.. మిగిలిన ఆరు టెస్టులలో భారత్ కచ్చితంగా నాలుగింట గెలవాల్సిందే. ముంబై వేదికగా నవంబర్ 1 నుంచి జరగే మూడో టెస్టులో భారత్ గెలిచి తీరాలి. అంతేకాదు బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని ఆస్ట్రేలియాపై భారత్ 3-2తో గెలవాలి. ఇక ప్రస్తుతం డబ్ల్యూటీసీ సైకిల్లో ప్రస్తుతం టీమిండియా(62.8%) అగ్రస్థానంలో ఉండగా.. ఆ తర్వాత ఆస్ట్రేలియా(62.5%), శ్రీలంక(55.5%), న్యూజిలాండ్(50.0%)తో రెండు, మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి.
ఇవి కూడా చదవండి
టీమిండియా డబ్ల్యూటీసీ లెక్కలు..
ఇది చదవండి: పటాస్ మూవీలో ఈ చిన్నది గుర్తుందా.? ఇప్పుడు అందంతో మత్తెక్కిస్తోందిగా
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..