Lokesh Kanagaraj: ‘ఆ వార్తలు పూర్తిగా అసత్యం.. నాకు ఆయన ఆరోగ్యమే ముఖ్యం’.. డైరెక్టర్ లోకేష్ కనగరాజ్..

2 hours ago 1

ఇదిలా ఉంటే ప్రస్తుతం తలైవా రెండు చిత్రాల్లో నటిస్తున్నారు. ఇప్పటికే డైరెక్టర్ టీజే జ్ఞానవేల్ తెరకెక్కిస్తోన్న వెట్టైయాన్ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. అక్టోబర్ 10న ఈ మూవీ రిలీజ్ కానుంది. అలాగే డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కూలీ చిత్రంలో నటిస్తున్నారు. కొన్నాళ్లుగా ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుంది. అయితే కూలీ సినిమా చిత్రీకరణ కారణంగానే రజినీ ఆరోగ్యం దెబ్బతిందని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి..

 'ఆ వార్తలు పూర్తిగా అసత్యం.. నాకు ఆయన ఆరోగ్యమే ముఖ్యం'.. డైరెక్టర్ లోకేష్ కనగరాజ్..

Lokesh Kanagaraj, Rajinikan

|

Updated on: Oct 05, 2024 | 4:36 PM

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ ఇటీవల అనారోగ్య సమస్యలతో చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. మూడు రోజులు చికిత్స అనంతరం గురువారం రాత్రి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి చేరుకున్నారు. అనంతరం తన ఆరోగ్యం కోసం ప్రార్ధించిన అభిమానులకు, సినీ ప్రముఖులకు, ప్రధానికి కృతజ్ఞతలు తెలిపుతూ ఓ పోస్ట్ చేశారు రజినీ. ఇదిలా ఉంటే ప్రస్తుతం తలైవా రెండు చిత్రాల్లో నటిస్తున్నారు. ఇప్పటికే డైరెక్టర్ టీజే జ్ఞానవేల్ తెరకెక్కిస్తోన్న వెట్టైయాన్ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. అక్టోబర్ 10న ఈ మూవీ రిలీజ్ కానుంది. అలాగే డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కూలీ చిత్రంలో నటిస్తున్నారు. కొన్నాళ్లుగా ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుంది. అయితే కూలీ సినిమా చిత్రీకరణ కారణంగానే రజినీ ఆరోగ్యం దెబ్బతిందని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి..

కూలీ సినిమా షూటింగ్ ఒత్తిడి కారణంగానే రజినీ ఆరోగ్యం చెడిపోయిందంటూ కూలీ చిత్రయూనిట్ ను తప్పుబడుతూ పలు తమిళ యూట్యూబ్ ఛానల్స్ వార్తలు ప్రచురించాయి. దీంతో రజినీ ఆరోగ్యం పై నెట్టింట పెద్ద ఎత్తున చర్చకు దారి తీశాయి. అయితే ఈ వార్తలపై స్పందించిన లోకేష్ కనగరాజ్ సదరు యూట్యూబ్ ఛానల్స్ పై మండిపడ్డారు. ఇలాంటి ఫేక్ వార్తలను నమ్మొద్దని.. తమకు సినిమా షూట్ కంటే రజినీ సర్ ఆరోగ్యమే ముఖ్యమంటూ చెప్పుకొచ్చారు.

“సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తలోల ఎలాంటి వాస్తవం లేదు. దాదాపు నెల రోజుల క్రితం వైజాగ్ షెడ్యూల్లో తన ఆరోగ్యం గురించి రజనీ సర్ మాతో చెప్పారు. తానొక సర్జరీ చేయించుకోవాల్సి ఉందననారు. ఈ క్రమంలోనే మేము సెప్టెంబర్ 28 నాటికి ఆయనకు సంబంధించిన ముఖ్యంగా షూటింగ్ పోర్షన్ కంప్లీట్ చేశాం. 30వ తేదీని ఆయన ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. నేను ఆయనతో మాట్లాడాను. ఆయన ఆరోగ్యం కంటే షూటింగ్ మాకు ముఖ్యం కాదు. కాబట్టి ఏదైనా విషయం పై పూర్తి అవగహన వచ్చిన తర్వాతే అలాంటి వార్తలు రాయండి అని కోరుతున్నాను” అంటూ లోకేష్ కనగరాజ్ చెప్పారు. అక్టోబర్ 15న రజినీ తిరిగి సెట్ లోకి అడుగుపెడతారని అన్నారు. బంగారం స్మగ్లింగ్ నేపథ్యంతో రాబోతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో నాగార్జున, ఉపేంద్ర, సౌబిన్ షాహిర్, శ్రుతి హాసన్, సత్యరాజ్ కీలకపాత్రలు పోషిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article