మహారాష్ట్రలో పర్యటిస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి అపూర్వ స్వాగతం లభించింది. వాషిమ్ చేరుకున్న ఆయనకు సాంప్రదాయ రీతిలో మహిళలు ఘన స్వాగతం పలికారు.
Pm Modi In Wardha
మహారాష్ట్రలో పర్యటిస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి అపూర్వ స్వాగతం లభించింది. వాషిమ్ చేరుకున్న ఆయనకు సాంప్రదాయ రీతిలో మహిళలు ఘన స్వాగతం పలికారు. మహారాష్ట్ర పర్యటన సందర్భంగా రూ.56,000 కోట్లకు పైగా వ్యయంతో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రధాని మోదీ ప్రారంభించారు. ముందుగా వాషిమ్కు వెళ్లిన మోదీ అక్కడ బంజారా హెరిటేజ్ మ్యూజియాన్ని ప్రారంభించారు. దీని తరువాత, అతను పోహ్రాదేవిలోని జగదాంబ మాత ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. సంత్ సేవాలాల్ మహారాజ్, సంత్ రామ్రావ్ మహారాజ్ సమాధుల వద్ద నివాళులర్పించారు. అనంతరం థానేలో రూ.32,800 కోట్లకు పైగా వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..