Pakistan: కరాచీలో భారీ బాంబ్ పేలుడు.. ఛాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్యంపై నీలిమేఘాలు?

2 hours ago 1

Champions Trophy 2025: మూడు టెస్టు మ్యాచ్‌ల కోసం ఇంగ్లండ్‌ జట్టు పాక్‌ పర్యటనలో ఉంది. అక్టోబర్ 7 నుంచి ముల్తాన్‌లో ఇరుజట్ల మధ్య సిరీస్ ప్రారంభమైంది. ముల్తాన్ టెస్టు ప్రారంభానికి ముందే పాకిస్థాన్‌లో ఉగ్రదాడి కలకలం సృష్టించింది. ఆదివారం అర్థరాత్రి కరాచీ విమానాశ్రయం వెలుపల భారీ పేలుడు సంభవించింది. ఇందులో ఇద్దరు వ్యక్తులు మరణించారు. అనేకమంది గాయపడ్డారు. విమానాశ్రయం వెలుపల ట్యాంకర్‌లో పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి విమానాశ్రయ భవనాలు కూడా కంపించాయి.

ఈ పేలుడు తర్వాత, పాకిస్థాన్‌లో ఛాంపియన్స్ ట్రోఫీని నిర్వహించకూడదని సోషల్ మీడియాలో డిమాండ్లు వస్తున్నాయి. వాస్తవానికి, వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పాకిస్థాన్‌లో ఛాంపియన్స్ ట్రోఫీని నిర్వహించాల్సి ఉంది. దీని కోసం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు సన్నాహాలు చేస్తోంది. ఇదిలా ఉండగా, పాకిస్థాన్‌లోని కరాచీ వంటి పెద్ద నగరంలో జరిగిన బాంబు పేలుడు ఘటన మరోసారి భద్రతపై ప్రశ్నలను లేవనెత్తింది. మరికొందరు అభిమానులు ఇంగ్లండ్‌ జట్టును పాకిస్థాన్‌ను విడిచిపెట్టి వెళ్లాలని సలహా ఇస్తున్నారు.

పాకిస్థాన్‌లో విదేశీ జట్ల భద్రత ఎప్పుడూ పెద్ద సమస్యగా మారింది. విదేశీ జట్లపై దాడుల కారణంగా పాకిస్థాన్ క్రికెట్ మైదానాలు చాలా ఏళ్లుగా నిర్మానుష్యంగా ఉన్నాయి. పాకిస్థాన్ జట్టు కూడా యూఏఈలో హోమ్ మ్యాచ్‌లు ఆడాల్సి వచ్చింది. 2009లో, లాహోర్‌లోని గడ్డాఫీ స్టేడియం వెలుపల శ్రీలంక జట్టు బస్సుపై దాడి జరిగింది. ఇందులో పలువురు శ్రీలంక ఆటగాళ్లు తీవ్రంగా గాయపడ్డారు. ఆ దాడి క్రికెట్ ప్రపంచాన్ని కుదిపేసింది. అంతేకాదు పాకిస్థాన్ క్రికెట్‌కు కూడా పెద్ద దెబ్బ తగిలింది.

Countries should boycott Pakistan #SCOSummit #Pakistan #Karachi

And @ICC should rethink the hosting Champions trophy successful Pakistan too pic.twitter.com/udUkUCFF7E

— Kartik Vikram (@iamkartikvikram) October 6, 2024

పాకిస్థాన్‌లో అంతర్జాతీయ క్రికెట్‌ను నిలిపివేశారు. ఆరేళ్ల తర్వాత, అంటే 2015లో జింబాబ్వే జట్టు పాకిస్థాన్‌లో పర్యటించింది. 2009 తర్వాత పాకిస్థాన్‌లో పర్యటించిన పూర్తి సభ్య జట్టుగా అవతరించింది. ఆ తరువాత, బంగ్లాదేశ్ మహిళల జట్టు పర్యటించింది. 2017 సంవత్సరంలో పాకిస్తాన్ సూపర్ లీగ్ ఫైనల్ ఆడింది. అయితే, కెవిన్ పీటర్సన్, ల్యూక్ రైట్‌తో సహా చాలా మంది ఆటగాళ్ళు భద్రతను దృష్టిలో ఉంచుకుని పాకిస్తాన్ పర్యటనకు నిరాకరించారు. దీని తర్వాత క్రికెట్ క్రమంగా పాకిస్తాన్‌కు తిరిగి వచ్చినప్పటికీ, ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు జరిగిన బాంబు పేలుడు ఆటగాళ్ల భద్రతపై మరోసారి ఆందోళన కలిగిస్తోంది.

How ironic is the signboard successful Karachi? Huge weaponry blasts astatine galore places successful Pakistan, and they situation to assertion it to beryllium a harmless spot to big the Champions Trophy. England needs to flight from Pak asap. @ICC @ECB_cricket pic.twitter.com/AEE23GCugt

— abhay singh (@abhaysingh_13) October 7, 2024

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article