తిరుమలలో చిరుత సంచారం కలకలం సృష్టించింది. రాత్రి శ్రీవారి మెట్టు మార్గంలో కంట్రోల్ రూమ్ దగ్గర చిరుత కనిపించింది. చిరుతపులిని గమనించిన సెక్యూరిటీ గార్డ్ భయంతో కంట్రోల్రూమ్లోకి వెళ్లాడు. వెంటనేే అటవీశాఖ అధికారులకు, టీటీడీ విజిలెన్స్ అధికారులకు సమాచారం ఇచ్చాడు.
Leopard
తిరుమలలో చిరుత సంచారం కలకలం సృష్టించింది. రాత్రి శ్రీవారి మెట్టు మార్గంలో కంట్రోల్ రూమ్ దగ్గర చిరుత కనిపించింది. చిరుతపులిని గమనించిన సెక్యూరిటీ గార్డ్ భయంతో కంట్రోల్రూమ్లోకి వెళ్లాడు. వెంటనేే అటవీశాఖ అధికారులకు, టీటీడీ విజిలెన్స్ అధికారులకు సమాచారం ఇచ్చాడు. చిరుత సంచారంతో భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది చిరుత జాడ కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నారు. అంతేకాకుండా.. జాగ్రత్తగా ఉండాలంటూ భక్తులకు సూచనలు చేస్తున్నారు. గుంపులు గుంపులుగా వెళ్లాలంటూ సూచిస్తున్నారు.
గత ఏడాది ఆగస్టులో అలిపిరి మార్గంలో చిన్నారిని చంపేసింది ఓ చిరుత. అప్పుడు ఆరుచిరుతలను బంధించి జూపార్క్కు తరలించారు అధికారులు. తాజాగా శ్రీవారి మెట్టు మార్గంలో చిరుత సంచరించడంతో భక్తులు, అధికారులు టెన్షన్ పడుతున్నారు.
వీడియో చూడండి..
చిరుత సంచారం నేపథ్యంలో ఇప్పటికే అప్రమత్తమైన అటవీశాఖ అధికారులు భక్తులకు ఎటువంటి అపాయం జరగకుండా చిరుత కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..