Tollywood: శీను వాసంతి లక్ష్మీ మూవీలోని ఈ హీరోయిన్ గుర్తుందా.? ఇప్పుడు చూస్తే మెంటలెక్కాల్సిందే

5 hours ago 1

శీను వాసంతి లక్ష్మీ.. 2004లో వచ్చిన ఈ మూవీ గుర్తుందా.? ఇందులో ఆర్పీ పట్నాయక్, నవ్‌నీత్ కౌర్, పద్మప్రియ ప్రధాన పాత్రలు పోషించారు. 'వాసంతియుం లక్ష్మియుం పిన్నే నిజానుం' అనే మలయాళ సినిమాకు ఇది రీమేక్.

 శీను వాసంతి లక్ష్మీ మూవీలోని ఈ హీరోయిన్ గుర్తుందా.? ఇప్పుడు చూస్తే మెంటలెక్కాల్సిందే

Tollywood

|

Updated on: Oct 08, 2024 | 12:10 PM

శీను వాసంతి లక్ష్మీ.. 2004లో వచ్చిన ఈ మూవీ గుర్తుందా.? ఇందులో ఆర్పీ పట్నాయక్, నవ్‌నీత్ కౌర్, పద్మప్రియ ప్రధాన పాత్రలు పోషించారు. ‘వాసంతియుం లక్ష్మియుం పిన్నే నిజానుం’ అనే మలయాళ సినిమాకు ఇది రీమేక్. ఈ చిత్రంలో ఆర్పీ పట్నాయక్ అంధుడిగా కనిపించారు. ఇక అతని చెల్లి పాత్రలో పద్మప్రియ అనే మలయాళ నటి నటించింది. మాంచి ప్రాధాన్యత ఉన్న పాత్ర కావడంతో.. పద్మప్రియ నటనకు ప్రశంసలు దక్కాయి.

ఈ సినిమా తర్వాత వరుసగా తమిళ, మలయాళ చిత్రాల్లో నటించింది పద్మప్రియ. తెలుగులో ఆమెకు సరైన అవకాశాలు రాలేదు. ఇక సరిగ్గా ఆరేళ్ల తర్వాత 2010లో ‘అందరి బంధువయ’, 2017లో ‘పటేల్ సర్’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది పద్మప్రియ. ఎక్కువగా మలయాళ చిత్రాల్లో నటించిన ఈ అందాల భామ.. 2017 నుంచి 2022 వరకు చిన్న బ్రేక్ తీసుకుని.. ‘వండర్ విమెన్’ అనే ఇంగ్లీష్ చిత్రంలో నటించింది. ఇక 2014లో పద్మప్రియ.. జాస్మిన్ షా అనే వ్యక్తిని పెళ్లాడింది. వీరిద్దరూ కలిసి న్యూయార్క్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. ఆ సమయంలో వీరిద్దరి స్నేహం, ప్రేమగా మారి.. ఆ తర్వాత పెళ్లికి దారి తీసింది.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: ఒంటరిగా చూడటమే బెటర్.! ఓటీటీలో రచ్చ రచ్చ.. ఈ రొమాంటిక్ థ్రిల్లర్ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article