మనుషులు, వన్యప్రాణులకు మధ్య సంఘర్షణలు పెరుగుతున్నాయి. ఈ విషయంలో కేరళకు, భారతదేశానికి ఎలాంటి తేడా లేదు. ప్రపంచవ్యాప్తంగా అడవుల్లో వేడి పెరుగుతోంది. నీరు, ఆహారం తగ్గుతోంది. ఒకే జాతికి చెందిన జంతువుల సంఖ్య పెరుగుతోంది. ఇలాంటివి అనేక కారణాలను చెప్పొచ్చు. కానీ సమస్యకు ఇంకా ఆచరణాత్మక పరిష్కారం సూచించబడలేదు. ఇటీవల, రాజస్థాన్లోని ఉదయపూర్ నగరంలో రాత్రి 8.30 గంటల ప్రాంతంలో ఒక బైక్, చిరుతపులి ఢీకొన్నాయి. దాని వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
సీసీటీవీ వీడియో ఫుటేజీలో, గోడ దూకి రోడ్డు దాటడానికి ప్రయత్నిస్తున్న చిరుతపులి, ఎదురుగా పాలు తీసుకువెళుతున్న వ్యక్తి బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ బోల్తా పడగా, బైక్ నడుపుతున్న వ్యక్తికి గాయాలయ్యాయి. అలాగే, బైక్పై అమ్మకానికి తీసుకెళ్తున్న పాలన్నీ రోడ్డుపై పడిపోయాయి. ప్రమాదం తర్వాత, చిరుతపులి లేవలేక రోడ్డుపై పడి ఉంది. ఇదంతా సమీపంలోని CCTV కెమెరాలో రికార్డైంది. ఇప్పుడా వీడియో నెట్టింట వైరల్గా మారింది.
ఇవి కూడా చదవండి
వీడియో ఇక్కడ చూడండి..
Watch: A video has emerged capturing a scary brushwood betwixt a leopard and a antheral erstwhile the large feline was trying to transverse a roadworthy successful a residential country adjacent Udaipur city. pic.twitter.com/T94EvD2BJQ
— Sunil Puri (@sunillp20) February 11, 2025
కొంత సమయం తరువాత, చిరుతపులి ఏదో విధంగా లేచి అక్కడ్నుంచి చీకట్లోకి వెళ్లిపోయింది. అప్పుడు బైకర్కు సహాయం చేయడానికి ఒక కారులో వచ్చిన ఇద్దరు వ్యక్తులు అతని వద్దకు వచ్చారు. కాగా, ఉదయపూర్లో చిరుతపులి దాడులకు సంబంధించిన సంఘటన కేసు ఇది మొదటిది కాదని అంటున్నారు. 2023లో ఉదయపూర్లోనే 80 చిరుతపులి దాడులు నమోదయ్యాయి. గత సంవత్సరం, 35 కిలోమీటర్ల పరిధిలో చిరుతపులి దాడుల్లో 8 మంది మరణించారు. అదే సమయంలో, సంబంధిత గణాంకాలు కూడా 2017లో రాజస్థాన్లో 507 చిరుతలు ఉన్నాయని, ఇది 2025లో 925కి పెరిగిందని చూపిస్తున్నాయి.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..