పండ్లు మన ఆరోగ్యానికి చాలా అవసరం. వైద్యులు సైతం పండ్లు ఎక్కువగా తీసుకోవాలని పదేపదే చెబుతుంటారరు. పండ్ల ద్వారా ప్రొటీన్, ఫైబర్, పొటాషియం వంటి పోషకాలు శరీరానికి అందుతాయి. కొంతమంది వివిధ రకాల పండ్లను సలాడ్ రూపంలో తినడానికి ఇష్టపడతారు. అయితే, అరటిపండు, బొప్పాయి కలిపి తినడం మాత్రం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ రెండు ఫ్రూట్స్ కలిపి తినడం వల్ల కలిగే ఆరోగ్య సమస్యల గురించి వివరిస్తున్నారు వైద్యులు. పూర్తి వివరాల్లోకి వెళితే..
Updated on: Feb 11, 2025 | 7:27 AM
బొప్పాయి,అరటి పండు రెండు విభిన్న స్వభావం కలిగిన పండ్లు. అందుకే వాటిని కలిపి తినడం వల్ల ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు వైద్యులు. బొప్పాయి, అరటిపండు కలిపి తింటే వాంతులు, కడుపునొప్పి, తలనొప్పి, వికారం, ఎసిడిటీ, గ్యాస్టిక్ ప్రాబ్లెమ్, అలర్జీ వంటి సమస్యలు వస్తాయని చెబుతున్నారు. అంతేకాదు..ఉబ్బసం, ఇతర శ్వాసకోశ సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉందంటున్నారు.
1 / 5
అరటి పండులో శరీరానికి అవసరమైన పొటాషియం, క్యాల్షియం లభించి శరీర కండరాలు కూడా బలపడతాయి. బొప్పాయి ని రెగ్యులర్ గా తినడం వల్ల కొలెస్ట్రాల్ ని అదుపులో ఉంచుతుంది. ఆయుర్వేదం ప్రకారం, అరటిపండు శరీరాన్ని చల్లబరుస్తుంది. బొప్పాయి శరీరాన్ని వేడి చేస్తుంది. రెండు వేర్వేరు స్వభావాలు కలిగిన ఈ రెండు పండ్లను తినడం మంచిది కాదు. ఈ సమస్యలు కూడా సాధ్యమే అంటున్నారు.
2 / 5
బొప్పాయి, అరటిపండును విడివిడిగా తినడం మంచిది. వాటిని విడివిడిగా తినడం వల్ల ఈ పండ్లలోని పోషకాలు మనకు ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. అరటిపండులో కాల్షియం, పొటాషియం, ఫైబర్, ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు ఉంటాయి. బొప్పాయిలో విటమిన్లు ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ, అలాగే అనేక బి కాంప్లెక్స్ విటమిన్లు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి మంచివి.
3 / 5
శ్వాస సమస్యలు ఉన్నవారు బొప్పాయి తినకపోవడం మంచిది. అరటి, బొప్పాయి కాంబినేషన్ తినడం వల్ల సమస్య తీవ్రమయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. అంతేకాదు..కామెర్లు సమస్యతో బాధపడుతున్నవారు కూడా బొప్పాయి అస్సలు తినకూడదంటున్నారు. ఇందులోని పపైన్, బీటా కెరోటిన్ కామెర్లు సమస్యను పెంచుతుందని చెబుతున్నారు.
4 / 5
అరటిపండు గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. బొప్పాయి పండు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. విడిగా తింటే మంచిది. ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే బొప్పాయి, అరటిపండు విడివిడిగా తినడం వల్ల శరీరానికి మేలు జరుగుతుంది.
5 / 5