ఇప్పుడా మాటలతో నెట్టింట అందర్నీ ఎమోషన్ల అయ్యేలా కూడా చేస్తున్నాడు. ఇక గాయాల నుంచి కోలుకున్న సైఫ్ అలీఖాన్ తాజాగా నేషనల్ మీడియాతో మాట్లాడాడు. మరోసారి తనపై దాడి జరిగిన క్రమాన్ని వివరిస్తూనే.. గాయంతో ఉన్న తనను చూసి.. తన కొడుకు పలికిన కొన్ని మాటల గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యాడు. తన పై దాడి చేసిన వ్యక్తిని క్షమించాలని తన కొడుకు తైమూర్ భావిస్తున్నట్టు సైఫ్ చెప్పాడు. దొంగ తనపై దాడి చేయడంతో.. వీపులో గాయమైందని.. ఆ గాయాన్ని చూసిన కరీనా ఎంతో కంగారు పడిందని చెప్పిన సైఫ్.. అప్పుడే తన కొడుకు తైమూర్ తన దగ్గరకు వచ్చి ‘నాన్న.. నువ్వు చనిపోతావా ? అని అడిగాడంటూ ఎమోషనల్ అయ్యాడు. అలా ఏం జరగదని చెప్పిన తాను.. ఆ తర్వాత తన కొడుకును ఆసుపత్రికి తీసుకెళ్లానని చెప్పాడు. తనకు ఏమైనా జరిగితే ఆ సమయంలో తన కుమారుడు తన పక్కనే ఉండాలని కోరుకున్నానని అందుకే అలా చేశానంటూ కళ్లల్లో నీళ్లు తెచ్చుకున్నాడు సైఫ్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సాయి పల్లవిని చూసి ఆశ్చర్యపోయిన నాగ్.. ఆకాశానికెత్తుతూ ట్వీట్!