ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు నదులు, కాల్వలు పొంగి పొర్లడంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి. పంటపొలాలు, రహదారులు, గ్రామాలు నీటమునుగుతున్నాయి. ఎక్కడ చూసినా నీరే కనిపిస్తోంది. దీంతో పాములు తమ ఆవాసాలను కోల్పోతున్నాయి. దాంతో ఆహారం కోసం జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి. ఎక్కడ చూసినా పాములు, కొండచిలువలు దర్శనమిస్తూ జనాలను భయాందోళనకు గురిచేస్తున్నాయి.
తాజాగా మంచిర్యాల జిల్లాలో ఓ ఇంటి సమీపంలో కొండచిలువ కలకలం రేపింది. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం అదిల్ పేట్ గ్రామంలో కొండచిలువ కలకలం రేపింది. గ్రామానికి చెందిన శివ అనేవ్యక్తి ఇంటికి సమీపంలో పశువుల కొట్టం ఉంది. ఎప్పటిలాగే అందులో పశువులు, మేకలను కట్టేశారు. ఎప్పుడు చొరబడిందో ఏమో కానీ ఓ పెద్ద కొండచిలువ పశువుల కొట్టంలోకి ప్రవేశించింది. అక్కడ ఓ మేకపిల్లను మింగేసి కదలకుండా అక్కడే పడుకుని ఉంది. ఇంతలో పశువుల కొట్టంవైపు వచ్చిన యజమాని కొండచిలువను చూసి షాకయ్యాడు. తీవ్ర భయాందోళకు గురైన అతను స్థానికులకు విషయం చెప్పాడు. స్థానికులు అక్కడకు చేరుకొని కొండచిలువను కొట్టి చంపేశారు. అయితే స్నేక్ క్యాచర్కి సమాచారం ఇచ్చి కొండ చిలువను చంపకుండా ఉండాల్సిందన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చాట్జీపీటీ సాయంతో సీవీ.. చూసి షాకైన సీఈఓ
22 ఏళ్లుగా ఇలాగే ఉన్నారు.. ఇంకా ఎన్నాళ్లిలా ??
సిడ్నీ బీచ్లో వింత ఘటన.. బీచ్ మూసివేత..
CPR Training: హార్ట్ స్ట్రోక్ వస్తే పిల్లలకు..పెద్దలకు ఫస్ట్ ఎయిడ్ ఎలా చెయ్యాలి
సైన్యంలోకి కొత్తగా 14 లక్షల మంది.. ఉత్తర కొరియా ఏం చేస్తోంది