లెబనీస్ రాజధానిపై వైమానిక దాడి.. 18 మంది మృతి, 90 మందికి పైగా గాయాలు!

2 hours ago 1

లెబనాన్‌లోని సెంట్రల్ బీరూట్‌లోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఇజ్రాయెల్ వైమానిక దాడులకు పాల్పడింది. ఈ ఘటనలో 18 మంది మరణించారు. 92 మంది గాయపడ్డారు. ఈ దాడులతో ఒక నివాస భవనం తీవ్రంగా దెబ్బతిన్నదని, మరో భవనం పూర్తిగా కుప్పకూలిందని లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. లెబనీస్ రాజధానిలో జరిగిన ఈ వైమానిక దాడులపై ఇజ్రాయెల్ సైన్యం వెంటనే వ్యాఖ్యానించలేదు. అయితే లెబనాన్‌లో ఇరాన్ మద్దతు ఉన్న హిజ్బుల్లాకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ తన దాడుల పరిధిని పెంచుకున్న సమయంలోఈ దాడులు జరిగాయి.

మొదటి దాడి రస్ అల్-నాబా ప్రాంతంలో జరిగింది. ఎనిమిది అంతస్తుల భవనం కింది భాగంలో పేలుడు సంభవించింది. అదే సమయంలో బుర్జ్ అబీ హైదర్ ప్రాంతంలో రెండవ దాడి జరిగింది. అక్కడ భవనం మొత్తం కూలిపోయి మంటల్లో చిక్కుకుంది. అంతకుముందు, పాలస్తీనా వైద్య అధికారులు మాట్లాడుతూ, గాజాలో నిరాశ్రయులైన ప్రజలకు ఆశ్రయం కల్పిస్తున్న పాఠశాలపై గురువారం ఇజ్రాయెల్ జరిపిన దాడిలో కనీసం 27 మంది మరణించారు.

అయితే, ఇజ్రాయెల్ సైన్యం ఎటువంటి ఆధారాలు అందించకుండానే, పౌరుల మధ్య దాక్కున్న ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకున్నట్లు పాలస్తీనా తెలిపింది. లెబనాన్‌లోని హిజ్బుల్లాకు వ్యతిరేకంగా యుద్ధం చేస్తోంది ఇజ్రాయెల్. ఇరాన్‌తో పెరుగుతున్న ఉద్రిక్తతలపై దృష్టి సారిస్తూనే, ఇజ్రాయెల్ పాలస్తీనా భూభాగాల్లోని తీవ్రవాద లక్ష్యాలపై దాడి చేస్తూనే ఉంది. ఈ వారం ప్రారంభంలో, ఇది ఉత్తర గాజాలో హమాస్‌కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున వైమానిక, భూమిపై నుంచి దాడులకు తెగబడింది.

ఇక, డీర్ అల్-బలాహ్‌లో జరిగిన దాడిలో ఒక చిన్నారి, ఏడుగురు మహిళలు సహా 27 మంది మరణించారని అల్-అక్సా మార్టిర్డమ్ హాస్పిటల్ తెలిపింది. ఈ దాడిలో పలువురు గాయపడ్డారని తెలిపారు. పాఠశాలలోని మిలిటెంట్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌ను లక్ష్యంగా చేసుకున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. గాజాలో షెల్టర్లుగా మార్చిన పాఠశాలల్లో ఉగ్రవాదులు దాక్కున్నారని ఆరోపిస్తూ ఇజ్రాయెల్ పదే పదే దాడులు చేసింది. ఆశ్రయం లోపల హమాస్ నడుపుతున్న తాత్కాలిక పోలీసు పోస్ట్‌పై దాడి చేశారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. సాధారణంగా హమాస్ ఆధ్వర్యంలో నడిచే పోలీసులు ఉపయోగించే గదిలో సహాయక బృందం ప్రతినిధులతో పాఠశాల నిర్వాహకులు సమావేశమవుతున్న సమయంలో ఈ దాడి జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఆ సమయంలో గదిలో పోలీసు లేరని తెలిపారు.

మరో సంఘటనలో, లెబనాన్‌లో ఇజ్రాయెల్ దాడిలో ఇద్దరు శాంతి పరిరక్షకులు గాయపడ్డారని ఐక్యరాజ్యసమితి అధికారి అజ్ఞాత పరిస్థితిపై ఈ సమాచారాన్ని ఇచ్చారు. మీడియాతో మాట్లాడే అధికారం తనకు లేదన్నారు. దక్షిణ లెబనాన్‌లోని శాంతి పరిరక్షక దళం యునిఫిల్‌లోని మూడు ప్రదేశాలపై ఇజ్రాయెల్ సైన్యం గురువారం కాల్పులు జరిపిందని అధికారి తెలిపారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article