గచ్చిబౌలిలోని ప్రిజం పబ్బులో పోలీసుల మీద కాల్పులు జరిపిన నిందితుడు బత్తుల ప్రభాకర్ నేరచరిత్ర చూసి పోలీసులు షాకయ్యారు. 2022 మార్చిలో విశాఖ జైలు నుంచి పరారైన అతనిపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో మొత్తం 80 చోరీ కేసులు ఉన్నట్లు గుర్తించారు. అందులోనూ.. కేవలం 11 చోరీల్లోనే రెండున్నర కోట్లు కొట్టేశాడు.
ఈ డబ్బులతో ఖరీదైన కార్లు కొంటూ.. పబ్బుల్లో గడుపుతూ ఎంజాయ్ చేస్తున్నాడు. ఇలా మూడేళ్లుగా పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్నాడు. కానీ.. గచ్చిబౌలి ప్రిజమ్ పబ్ దగ్గర పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. బత్తుల ప్రభాకర్ను అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు.. కోర్టు.. 14 రోజుల రిమాండ్ విధించడంతో జైలుకు తరలించారు. అయితే.. బత్తుల ప్రభాకర్ కేసు విచారణలో విస్తుపోయే అంశాలు వెలుగులోకి వచ్చాయి. ప్రభాకర్ ఛాతిపైనున్న టాటూ ఆధారంగా కీలక విషయాలు చేధించారు. ఇంజనీరింగ్ కాలేజీలే టార్గెట్గా ప్రభాకర్ చోరీలకు పాల్పడ్డాడు. మూడు కోట్ల రూపాయలు చోరీ చేసేందుకు టార్గెట్ పెట్టుకున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.
మరిన్ని వీడియోల కోసం :
పెళ్లికి వేళాయరా.. మంచి ముహుర్తాలు వచ్చేశాయ్!
రైల్వే ట్రాక్పై కూర్చొని ఫోన్లో మాట్లాడుతున్న యువకుడు.. ఇంతలో.. వీడియో