ఇంగ్లండ్తో జరుగుతోన్న ఐదో టీ20 మ్యాచ్లో టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ అదరగొట్టాడు. కేవలం 37 బంతుల్లోనే ధనా ధన్ సెంచరీ సాధించి ఇంగ్లండ్ బౌలింగ్ వెన్ను విరిచాడు. శివం దూబే (13 బంతుల్లో 30) మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో ముంబైలో టీమిండియా భారీ స్కోరు నమోదు చేసింది.
Abhishek Sharma
ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరుగుతోన్న ఐదో టీ20 మ్యాచ్లో అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. తన గురువు యువరాజ్ తరహాలో మైదానంలో ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించాడు. ఓ వైపు సహచరులు వెంట వెంటనే ఔటవుతున్నాఏ మాత్రం నెరవకుండా కేవలం 37 బంతుల్లోనే మెరుపు సెంచరీ సాధించాడు. ఈ సెంచరీ ఇన్నింగ్స్లో 5 ఫోర్లు, 10 సిక్సర్లు ఉన్నాయి. ఓవరాల్ గా ఈ మ్యాచ్ లో 54 బంతులు ఎదుర్కొన్న అభిషేక్ 13 సిక్సర్లు, 7 ఫోర్ల సాయంతో 135 పరుగులు చేసి ఔటయ్యాడు. ఫలితంగా భారత్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 247 పరుగుల భారీ చేసింది. మరి ఇంగ్లండ్ జట్టు ఈ టార్గెట్ ను ఛేదిస్తుందా? రెండో ఇన్నింగ్స్లో మంచు ప్రభావం చూపనుంది కాబట్టి భారత బౌలర్లు ఎలా రాణిస్తారనేది ఆసక్తికరంగా మారింది.
ఇవి కూడా చదవండి
Innings Break!
A smashing batting show from #TeamIndia 🔥🔥
Abhishek Sharma’s unthinkable TON powers his broadside to 247/9 👏👏
Over to our bowlers 💪
Scorecard ▶️ https://t.co/B13UlBNdFP#INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/J9b48OVlUy
— BCCI (@BCCI) February 2, 2025
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..