India vs Pakistan: నిమిషాల్లోనే హాట్ కేకుల్లా ఖలాస్.. మ్యాచ్‌ టిక్కెట్ల ధర తెలిస్తే షాక్ అవడం ఖాయం….?

2 hours ago 1

ఇండియా-పాకిస్తాన్ మధ్య జరిగే క్రికెట్ మ్యాచ్‌లు ఎప్పుడూ అభిమానులను ఉర్రూతలూగిస్తాయి. 2025 ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ vs పాకిస్తాన్ గ్రూప్-స్టేజ్ మ్యాచ్‌కు డిమాండ్ అమాంతం పెరిగింది. ఫిబ్రవరి 23న దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా ఈ హై-వోల్టేజ్ పోరు జరగనుండగా, టిక్కెట్లు అమ్మకానికి వచ్చిన కొన్ని నిమిషాల్లోనే సోల్డ్ అవుట్ అయ్యాయి. టిక్కెట్ల కోసం 1,50,000 మందికి పైగా అభిమానులు ఆన్‌లైన్‌లో క్యూలో నిలబడి, గంటకు పైగా వేచిచూసినప్పటికీ, చాలా మంది నిరాశచెందారు. కొన్ని విభాగాల్లో టిక్కెట్ల ధరలు లక్ష రూపాయలకు పైగా ఉండటంతో, క్రికెట్ పట్ల అభిమానుల ఆత్రుత మరోసారి రుజువైంది.

టిక్కెట్ల రద్దీతో అభిమానుల ఆశ్చర్యం

టిక్కెట్ల కోసం పోటీ తీవ్రంగా ఉండటంతో, దుబాయ్‌ నివాసితులు, క్రికెట్ ఔత్సాహికులు ఆశ్చర్యపోయారు. “నేను చాలా పొడవైన క్యూను ఊహించాను, కానీ టిక్కెట్లు ఇంత వేగంగా అమ్ముడుపోవడం అసలు ఊహించలేదు. నేను నా టికెట్ బుక్ చేసుకునే సమయానికి, కేవలం ఖరీదైన విభాగాలే మిగిలి ఉన్నాయి” అని దుబాయ్‌కు చెందిన క్రికెట్ అభిమాని సుధాశ్రీ అన్నారు. దిర్హామ్ 2,000 (సుమారు ₹47,434) ధర గల ప్లాటినం విభాగం, దిర్హామ్ 5,000 (₹1.8 లక్షలు) విలువైన గ్రాండ్ లాంజ్ విభాగం టిక్కెట్లు కూడా వేగంగా అమ్ముడయ్యాయి. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం కేవలం 25,000 మంది ప్రేక్షకులకు మాత్రమే వసతిని కల్పించగలదని దృష్టిలో ఉంచుకుంటే, ఇండియా vs పాకిస్తాన్ మ్యాచ్ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది.

చారిత్రాత్మకంగా, భారతదేశం vs పాకిస్తాన్ మ్యాచ్ కేవలం క్రికెట్‌ మైదానంలోనే కాకుండా, ఆర్థికంగా కూడా ప్రభావం చూపుతుంది. ఇండియా-పాక్ మ్యాచ్‌లు జరగబోయే నగరాల్లో హోటల్ బుకింగ్‌లు పెరిగాయి, విమాన ఛార్జీలు పెరిగాయి. ఈ పోటీలో ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు తరలివస్తారని పరిశ్రమ నిపుణులు అంచనా వేస్తున్నారు. పర్యాటక రంగం, ప్రయాణ వ్యాపారాలు ఈ క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నాయి.

చాంపియన్స్ ట్రోఫీ 2025 ఫార్మాట్

రెండు వారాల పాటు జరిగే ఈ టోర్నమెంట్‌లో ఎనిమిది జట్లు పాల్గొంటాయి. మొత్తం 15 మ్యాచ్‌లు జరగనున్నాయి.

గ్రూప్ A: భారతదేశం, పాకిస్తాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ గ్రూప్ B: ఆఫ్ఘనిస్తాన్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా ఫిబ్రవరి 19న పాకిస్తాన్-న్యూజిలాండ్ మధ్య కరాచీలో తొలి మ్యాచ్ జరుగుతుంది. భారత్ మాత్రం దుబాయ్‌లోనే తన అన్ని మ్యాచ్‌లు ఆడనుంది.

ప్రస్తుతం ఛాంపియన్స్ ట్రోఫీ హైబ్రిడ్ మోడల్‌లో జరుగుతోంది. ప్రారంభంలో ఈ టోర్నమెంట్ పూర్తిగా పాకిస్తాన్‌లో నిర్వహించాలని అనుకున్నప్పటికీ, భారతదేశం పాకిస్తాన్ వెళ్లేందుకు నిరాకరించడంతో, PCB, ICC, BCCI మధ్య చర్చల అనంతరం వేదికలను మార్చారు. భారత జట్టు మొత్తం మ్యాచ్‌లు దుబాయ్‌లోనే ఆడనుంది.

ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ ఇప్పటికే 100% సామర్థ్యంతో హౌస్‌ఫుల్ అయిన నేపథ్యంలో, ఫ్యాన్స్ సెకండరీ మార్కెట్లు, అధికారిక రీసేల్ ప్లాట్‌ఫామ్‌లను ఆశ్రయిస్తున్నారు. క్రికెట్ ప్రపంచంలోనే అత్యంత ఉత్కంఠభరితమైన ఈ పోరును ప్రత్యక్షంగా వీక్షించాలని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

2017 ఛాంపియన్స్ ట్రోఫీని గెలిచిన పాకిస్తాన్ డిఫెండింగ్ ఛాంపియన్‌గా పోటీలోకి ప్రవేశిస్తుంది. అప్పటి ఫైనల్లో భారత్‌ను ఓడించి టైటిల్ గెలుచుకున్న పాక్, సొంతగడ్డపై మరోసారి కిరీటం కాపాడుకోవాలని చూస్తోంది.

చాంపియన్స్ ట్రోఫీ 2025లో అత్యంత విజయవంతమైన జట్లు భారతదేశం, ఆస్ట్రేలియా జట్లు ఒక్కొక్కటి రెండు సార్లు ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచి అత్యంత విజయవంతమైన జట్లుగా నిలిచాయి.

భారత అభిమానులు ఇప్పుడు తమ జట్టు మరోసారి ట్రోఫీ గెలుస్తుందా? లేదా 2017 ఫైనల్ దృశ్యం పునరావృతమవుతుందా? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article