ఇదెక్కడి చెత్త టీం.. పాకిస్తాన్ స్వ్కాడ్‌లో ఆ ఆరుగురిపై విమర్శలు.. ఛాంపియన్స్ ట్రోఫీలో అట్టర్ ఫ్లాప్

2 hours ago 1

Pakistan Champions Trophy 2025 Team Controversy: 2025 ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాకిస్తాన్ తన జట్టును ప్రకటించింది. కానీ, ఈ జట్టు తన సొంత ఆతిథ్యంలో ఐసీసీ టోర్నమెంట్‌ను గెలవగలదా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అందుకు కారణం కూడా తాజాగా బయటకు వచ్చింది. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఎంపిక చేసిన జట్టును PCB సొంత వ్యక్తులు కూడా విశ్వసించడం సాధ్యం కానందున ఈ ప్రశ్న తలెత్తుతుంది. వీరందరి ఆత్మవిశ్వాసం లేకపోవడానికి కారణం జట్టు ఎంపికలో లోపాలు. ఛాంపియన్స్ ట్రోఫీ జట్టుపై ప్రశ్నలు లేవనెత్తిన పాకిస్తాన్ లెజెండ్ అబ్దుర్ రవూఫ్ ఖాన్.. పాకిస్తాన్ టీవీ ఛానెల్‌లో జట్టుకు సంబంధించిన షోలో పాక్ జట్టును తీవ్రంగా విమర్శించాడు.

పాక్ జట్టు బాబర్ ఆజంపై ఆధారపడి ఉందా?

టీవీ ఛానెల్‌లో ప్రసారమైన కార్యక్రమంలో, పాకిస్తాన్ జట్టు బాబర్ ఆజంపై ఆధారపడి ఉందని చెప్పుకొచ్చాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో బాబర్ ఆజం బ్యాట్ పనిచేస్తేనే ఏదైనా జరుగుతుందని తెలిపాడు. అనుభవజ్ఞులు కూడా ఈ షోలో సౌద్ షకీల్‌పై కొంత నమ్మకాన్ని చూపించడం గమనార్హం.

ఇది కూడా చదవండి: IPL 2025: కోహ్లీ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.. RCB కెప్టెన్‌పై ఫ్రాంచైజీ కీలక ప్రకటన

ఇవి కూడా చదవండి

ఆరుగురు ఆటగాళ్ల రహస్యం వెలుగులోకి..!

ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపికైన జట్టును నమ్మడం పాకిస్తానీ లెజెండ్‌కు కష్టమైంది. ఎందుకంటే, అందులో చేర్చిన ఆరుగురు ఆటగాళ్లకు సంబంధించిన రహస్యం దిగ్భ్రాంతికరంగా ఉంది. ఆ 6గురు ఆటగాళ్ళలో ఎవరూ వన్డే ఆడలేదు. వారిలో కొందరు ఆడి దాదాపు 2 సంవత్సరాలు దాటింది. జట్టులో చేరిన ఆ 6గురు ఆటగాళ్లను ఓసారి పరిశీలిద్దాం..

ఫఖర్ జమాన్- అతను 2023 ప్రపంచ కప్‌లో పాకిస్తాన్ తరపున తన చివరి వన్డే ఆడాడు.

ఉస్మాన్ ఖాన్ – అతను పాకిస్తాన్ తరపున ఛాంపియన్స్ ట్రోఫీలో అరంగేట్రం చేయడాన్ని చూడొచ్చు.

ఫహీమ్ అష్రఫ్- చివరిసారిగా 2023 ఆసియా కప్‌లో పాకిస్తాన్ తరపున వన్డే ఆడాడు.

ఖుస్దిల్ షా- అతను కూడా అక్టోబర్ 2023 నుంచి ఏ వన్డే మ్యాచ్ ఆడలేదు.

అబ్రార్ అహ్మ, తయ్యబ్ తాహిర్ – ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాకిస్తాన్ జట్టులో ఎంపికైన మరో ఇద్దరు ఆటగాళ్ళు. వీరికి 5 కంటే తక్కువ వన్డేల అనుభవం ఉంది. అబ్రార్ 4 వన్డేలు ఆడగా, తైబ్ 3 వన్డేలు ఆడాడు.

ఇది కూడా చదవండి: IND vs ENG 1st ODI: ఇంగ్లాండ్‌తో జరిగే తొలి వన్డే నుంచి స్టార్ ఆల్ రౌండర్ ఔట్..! రీజన్ చెప్పేసిన మాజీ క్రికెటర్

ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానుంది. దీనిలో పాకిస్తాన్ తన మొదటి రోజునే న్యూజిలాండ్‌తో తన ప్రచారాన్ని ప్రారంభిస్తుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article