Ratan Tata Passed Away Live: దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్‌ టాటా కన్నుమూత.. కన్నీరు పెట్టుకుంటున్న యావత్ భారతం

1 hour ago 1

ముంబై, అక్టోబర్‌ 10: బిజినెస్‌ టైకూన్‌, టాటా గ్రూప్స్‌ మాజీ ఛైర్మన్‌ రతన్ టాటా (86) బుధవారం అర్ధరాత్రి 11.30 గంటలకు తుది శ్వాస విడిచారు. చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. రతన్‌ టాటా మరణ వార్తను టాటాసన్స్‌ ఛైర్మన్‌ ఎన్‌ చంద్రశేఖరన్‌ సోషల్ మీడియా ద్వారా ధ్రువీకరించారు. ఆయన మృతి పట్ల భారత రాష్ట్రపతి ముర్ము, ఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్‌, ప్రధాని మోదీ, హోంమంత్రి అమిషాతో సహా పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. రతన్‌ టాటా అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో గురువారం నిర్వహిస్తామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే ప్రకటించారు. 1990 నుంచి 2012 వరకు టాటా గ్రూప్స్‌ సంస్థలకు ఛైర్మన్‌గా వ్యవహరించిన రతన్‌ టాటా.. అక్టోబర్ 2016 నుంచి ఫిబ్రవరి 2017 వరకు తాత్కాలిక ఛైర్మన్‌గా వ్యవహరించారు. రతన్‌ టాటా సేవలను గానూ భారత ప్రభుత్వం మూడో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్‌ (2000), రెండో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణ్‌ (2008)తో సత్కరించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article