దివంగత నటుడు ఉదయ్ కిరణ్ తన కెరీర్ లో ఎక్కువగా లవ్ అండ్ యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్ టైనర్స్ లోనే నటించాడు. లవర్ బాయ్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు ఉదయ్. స్టార్ హీరోగా ఎదుగుతాడు అనుకునే తరుణంలో ఎవరూ ఊహించని విధంగా ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయ్ నటించిన రొమాంటిక్ ఎంటర్టైనర్స్ లో 2008లొ వచ్చిన ప్రేమ కథా చిత్రం గుండె ఝల్లుమంది. గతేడాది అనారోగ్యంతో కన్నుమూసిన దర్శకుడు మదన్ ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో ఉదయ్ కిరణ్ సరసన బాలీవుడ్ బుల్లితెర బ్యూటీ అదితీ శర్మ నటించింది. తెలుగులో ఇదే ఆమెకు మొదటి సినిమా. అయినా ఎంతో చక్కగా నటించిందీ అందాల తార. ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది.
సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయినా.. అదితీ అందం, అభినయానికి అప్పటి కుర్రకారు ఫిదా అయిపోయారు. గుండె ఝల్లుమంది తర్వాత ఓం శాంతి అనే మల్టీ స్టారర్ మూవీలో కనిపించింది అదితి. ఇందులో నవదీప్, నిఖిల్, కాజల్ అగర్వాల్ వంటి నటీనటులతో స్క్రీన్ షేర్ చేసుకుందీ అందాల తార. ఈ సినిమాకు కూడా ప్రశంసలు వచ్చాయి తప్పితే కమర్షియల్ గా విజయం సాధించ లేదు. దీని తర్వాత బబ్లూ అనే ఓ సినిమాలోనూ నటించింది అదితి. ఇది కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. దీంతో తెలుగులో ఈ ముద్దుగమ్మకు అవకాశాలు కరువయ్యాయి.
ఆతర్వాత కొన్ని పంజాబీ, హిందీ సినిమాల్లో నూ నటించింది. మొత్తం మీద తెలుగు, హిందీ, పంజాబీ, తదితర భాషలలో కలిపి దాదాపుగా 12కి పైగా చిత్రాలలో నటించింది అదితీ శర్మ. కాగా 2014లో బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి చెందిన ‘సర్వర్ ఆహుజా’ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది అదితీ శర్మ. ఈ దంపతులకు 2019లో సర్తాజ్ అనే కుమారుడు జన్మించాడు. కాగా పెళ్లి తర్వాత కేవలం పంజాబీ సినిమాలకే పరిమితమంది అదితి. అలాగే టీవీ షోస్ లోనూ మెరుస్తోంది. వీటితో పాటు తన భర్త బిజినెస్ పనులను కూడా చూసుకుంటోంది. ఇక సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటోందీ అందాల తార.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి