ఐర్లాండ్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతిచెందారు. ఈ ఘటనలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. చనిపోయిన వారిని NTR జిల్లా జగ్గయ్యపేటకు చెందిన చిట్టూరి భార్గవ్, పల్నాడు జిల్లా రొంపిచర్ల పడమటి పాలేనికి చెందిన చెరుకూరి సురేష్ గా గుర్తించారు. జగ్గయ్యపేట మండలం గండ్రాయికి చెందిన చిట్టూరి సాయిబాబా జగ్గయ్యపేటలోని
అయ్యప్పనగర్లో నివాసం ఉంటున్నారు. అక్కడ ప్యూరిఫైడ్ వాటర్ పరికరాల బిజినెస్ చేస్తున్నారు. సాయిబాబా పెద్ద కుమారుడు భార్గవ్ మూడేళ్ల క్రితం ఉన్నత చదువుల కోసం ఐర్లాండ్ వెళ్లారు.. కార్లోలోని సౌత్ఈస్ట్ టెక్నలాజికల్ యూనివర్సిటీలో చదువుతున్నాడు. భార్గవ్ అక్కడ చదువుకుంటూ పార్ట్ టైం ఉద్యోగం కూడా చేస్తున్నారు. చెరుకూరి రామకోటయ్య, కుమారి దంపతులకు పెద్ద కుమారుడు సురేష్ ఎమ్మెస్ చేసేందుకు ఏడాది క్రితం ఐర్లాండ్ వెళ్లాడు.
మరిన్ని వీడియోల కోసం :
పెళ్లికి వేళాయరా.. మంచి ముహుర్తాలు వచ్చేశాయ్!
రైల్వే ట్రాక్పై కూర్చొని ఫోన్లో మాట్లాడుతున్న యువకుడు.. ఇంతలో.. వీడియో
Published on: Feb 02, 2025 01:24 PM