మహాకుంభమేళా ద్వారా ప్రజలు రకరకాలుగా సొమ్ము చేసుకుంటున్నారు. టీ-కాఫీ, తాగునీరు, చిరుతిళ్లు, ఉన్ని బట్టలు సహా అనేక వస్తువులను విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇన్ని వ్యాపారాల మధ్య, గోరఖ్పూర్కు చెందిన ఒక యువకుడు సూపర్ ఐడియాతో రోజుకు రూ. 8,000 కంటే ఎక్కువగానే సంపాదిస్తున్నాడు. మరి ఆ యువకుడికి ఎలాంటి సూపర్ ఐడియా వచ్చిందో చూద్దాం.
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా ఘనంగా కొనసాగుతోంది. త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేసేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు బారులు తీరుతున్నారు. లక్షలు, కోట్లలో వస్తున్న భక్తుల రద్దీతో ప్రయాగ్రాజ్ వ్యాపార కేంద్రంగా మారింది. ఇక్కడ టీ అమ్మడం ద్వారా చాలా మంది వ్యాపారాలు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. మహాకుంభమేళా ద్వారా ఎంతో మంది ఆర్థికంగా బలోపేతం అవుతున్నారు. మహాకుంభమేళాకు చేరుకున్న నాగ సాధువులు, వ్యాపారుల ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అలాంటిదే ఈ వీడియో కూడా.
మరిన్ని వీడియోల కోసం :
పెళ్లికి వేళాయరా.. మంచి ముహుర్తాలు వచ్చేశాయ్!
రైల్వే ట్రాక్పై కూర్చొని ఫోన్లో మాట్లాడుతున్న యువకుడు.. ఇంతలో.. వీడియో