టాస్ కు ముందు బెంచ్ మీదే..కట్ చేస్తే ధనాధన్ ఇన్నింగ్స్ తో పవర్ చూపించిన గేమ్ ఛేంజర్

2 hours ago 3

టీమిండియా బ్యాట్స్‌మన్ శ్రేయస్ అయ్యర్ మరోసారి తన బ్యాటింగ్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి వన్డేలో భారత్ 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించగా, అయ్యర్ తన అద్భుత ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌ను భారత దిశగా మలిచాడు. నంబర్ 4 స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన అతను 50 బంతుల్లో వేగంగా 59 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. కానీ అసలు ఈ మ్యాచ్‌లో అయ్యర్‌కు చోటు దక్కడం అనుకోని పరిణామమే. విరాట్ కోహ్లీ గాయం కారణంగా అతనికి తుది జట్టులో అవకాశం లభించింది. ఈ విజయానికి అనంతరం అయ్యర్ తన సోషల్ మీడియా ఖాతాలో ఓ పవర్‌ఫుల్ పోస్ట్ షేర్ చేస్తూ తన భావాలను వెల్లడించాడు.

రోహిత్ శర్మ నుంచి అనుకోని కాల్..!

మ్యాచ్ అనంతరం అయ్యర్ తన ఎంపికకు సంబంధించిన ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు. “రాత్రి సినిమా చూస్తూ రిలాక్స్ అవుతున్నా. ఆ రాత్రిని ఎంజాయ్ చేయొచ్చని అనుకున్నా. కానీ అకస్మాత్తుగా సారథి రోహిత్ శర్మ నుంచి కాల్ వచ్చింది. విరాట్ పూర్తిగా ఫిట్‌గా లేడని, నేను ఆడే అవకాశం ఉందని చెప్పాడు. వెంటనే నా గదికి వెళ్లి నిద్రపోయి, మెంటల్‌గా గేమ్‌కి రెడీ అయ్యా,” అని అయ్యర్ చెప్పాడు.

జైస్వాల్ ఎంపికపై చురుకైన స్పందన..!

తొలుత జైస్వాల్‌ను నెంబర్ 4 స్థానానికి ఎంపిక చేయడం, తాను తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోవడంపై అయ్యర్ స్పందిస్తూ తెలివిగా సమాధానం ఇచ్చాడు. “మీరు నన్ను ఏదైనా వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేయించాలనుకుంటున్నారు. కానీ నేను ప్రశాంతంగా ఈ విజయాన్ని ఆస్వాదిస్తాను,” అని హాస్యంతో స్పందించాడు.

ఇప్పుడిక రెండో వన్డేలో విరాట్ కోహ్లీ పూర్తిగా ఫిట్ అయితే, రోహిత్ శర్మ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి!

ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ – 248 పరుగులకే ఆలౌట్

నాగ్‌పూర్ వేదికగా జరిగిన తొలి వన్డేలో ఇంగ్లాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. మిడిల్ ఓవర్లలో వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్ 48 ఓవర్లలో 248 పరుగులకు ఆలౌట్ అయింది. జోస్ బట్లర్ (52) మరియు జాకబ్ బెథెల్ (51) హాఫ్ సెంచరీలు చేయగా, కీలక సమయాల్లో వికెట్లు పడిపోవడంతో ఇంగ్లాండ్ భారీ స్కోర్ చేయలేకపోయింది.

భారత బౌలింగ్ – హర్షిత్, జడేజా మెరుపులు

భారత బౌలింగ్‌లో హర్షిత్ రాణా (3/53) మరియు రవీంద్ర జడేజా (3/26) అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారు. వీరి స్పెల్‌ల కారణంగా ఇంగ్లాండ్ 250 పరుగుల లోపే పరిమితమైంది.

భారత విజయ ఇన్నింగ్స్ – గిల్, అయ్యర్, అక్షర్ అదరగొట్టారు

249 పరుగుల లక్ష్య ఛేదనలో భారత బ్యాటింగ్ స్టెడీగా కొనసాగింది. శుభ్‌మన్ గిల్ 87 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అతనికి శ్రేయస్ అయ్యర్ (59) మరియు అక్షర్ పటేల్ (52) చక్కటి సహకారం అందించారు. ఈ ముగ్గురు బ్యాట్స్‌మెన్ హాఫ్ సెంచరీలు సాధించడంతో, భారత్ 38.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లిన భారత్.. రెండో వన్డే ఫిబ్రవరి 9న కటక్‌లో జరగనుంది. మరి రెండో వన్డేలో ఇంగ్లాండ్ ఎలా ప్రతిస్పందిస్తుందో చూడాలి!

No amended feeling 🇮🇳 pic.twitter.com/DuPYfL4Gja

— Shreyas Iyer (@ShreyasIyer15) February 6, 2025

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article