Updated on: Feb 11, 2025 | 5:46 PM
ఒక్కోసారి ప్రమాదం ఎటు నుంచి వస్తుందో తెలియదు. మనం ప్రమాదకరమైన ప్రదేశంలోకి వెళ్లకపోయినా ఊహించిన విధంగా ప్రమాదం మనల్ని వెతుక్కుంటూ వస్తే అదృష్టం ఉంటే తప్ప బయటపడటం అంత ఈజీ కాదు. అలాంటి సందర్భమే ఎదురైంది ఈ రైతుకి. తప్పించుకునే అవకాశం లేని విపత్కర పరిస్థితిని ఎదుర్కొన్నాడు. సరిగ్గా ఆ టైంలో జరిగిన గమ్మత్తైన తమాషా ఆ రైతుకి భూమ్మీద నూకలున్నాయనే దైర్యాన్ని ఇచ్చింది. ఒక రైతు మరో వ్యక్తితో కలిసి బైక్పై పొలం వైపు వెళ్తున్నాడు. ఆ గట్టు దారిలో ఒక పులి వారికి కనిపించింది. దీంతో వారిద్దరూ అప్రమత్తమయ్యారు. పులి తమ వైపు వస్తుండటాన్ని గమనించారు. అక్కడి నుంచి వెనక్కి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఇది చూసిన ఆ పులి చాలా రిలాక్స్గా ఆ దారిపై సేదతీరింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్లోని పిలిభిత్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఒక రైతు మరో వ్యక్తితో కలిసి బైక్పై పొలం మార్గంలో వెళ్తున్నాడు. కొన్ని అడుగుల దూరంలో గడ్డి పొదల్లో దాగిన పులి మెల్లగా బయటకు వచ్చింది.
ఆ ఇద్దరిని చూసి వారి వైపు కదిలింది. బైక్పై కూర్చున్న రైతు ప్రమాదాన్ని పసిగట్టాడు. వెనక్కి వెళ్లేందుకు బైక్ను తిప్పాడు. బైక్పై అక్కడి నుంచి వెళ్లేందుకు సిద్ధమైన వారిద్దరినీ ఆ పులి చూసింది. తనకు కూడా వారి వల్ల ఎలాంటి ప్రమాదం లేదని అది భావించింది. దీంతో ఆ ఇద్దరిని వెంబడించడాన్ని మానుకుంది. చాలా ప్రశాంతంగా పొలం గట్టు మార్గంపై కూర్చొంది. ఒక వ్యక్తి రికార్డ్ చేసిన ఈ వీడియో క్లిప్ను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి పర్వీన్ కస్వాన్ ఎక్స్లో షేర్ చేశారు. ‘రైతు, పులి ఎదురుపడ్డారు. సహజీవనం ఇలాగే కనిపిస్తుంది. పిలిభిత్ నుంచి’ అని క్యాప్షన్ ఇచ్చారు. మరోవైపు ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నెటిజన్లు భిన్నంగా స్పందించారు. అదృష్టవశాత్తు ఆ వ్యక్తులకు ఏమీ జరగలేదని ఒకరు, ఆ రైతు గురించి పులికి తెలుసుంటుందని, అందుకే వారిని వెంబడించలేదని మరొకరు అన్నారు. ఆ వ్యక్తులు వెనుతిరగడంతో వారి నుంచి ప్రమాదం లేదని భావించిన ఆ పులి ప్రశాంతం అయిందని ఒకరు అభిప్రాయపడ్డారు.
మరిన్ని వీడియోల కోసం :