అతివేగం ఇద్దరి ప్రాణాలను బలి తీసుకుంది. జగిత్యాల జిల్లా గొల్లపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మహిళా ఎస్ఐతోపాటు మరో వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. జగిత్యాల హెడ్క్వార్టర్స్లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న కొక్కుల శ్వేత కారులో గొల్లపల్లి నుంచి జగిత్యాలకు వస్తుండగా, చిల్వాకోడూర్ దగ్గర బైక్ను తప్పించబోయి రోడ్డు పక్కన ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన శ్వేత అక్కడిక్కడే మృతి చెందింది. ప్రమాదం జరిగి సమయంలో సీటు బెల్టు పెట్టుకోకపోవడంతో శ్వేత స్పాట్ లోనే ప్రాణాలు విడిచారు. ఇక ఆ బైక్పై వెళుతున్న నరేశ్ అనే వ్యక్తి కూడా ప్రాణాలు కోల్పోయారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జగిత్యాల ఆసుపత్రికి తరలించారు. శ్వేత గతంలో వెల్గటూర్ పోలీస్ స్టేషన్లో సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేశారు. ఇటీవల కోరుట్ల నుంచి జగిత్యాలకు బదిలీ అయ్యారు. సోమవారం రాత్రి స్వగ్రామం చొప్పదండి మండలం అర్నకొండకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పదో తరగతి విద్యార్ధులకు అలర్ట్.. ప్రీ ఫైనల్ పరీక్షల షెడ్యూల్ ఇదే
ఏంటి అధ్యక్షా ఇది.. పెళ్లిళ్లున్నాయ్.. బంగారం కొననివ్వరా ??
మెరుగైన చికిత్స కోసం విదేశాలకు శ్రీతేజ్! బన్నీవాసు కీలక నిర్ణయం