బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై జరిగిన దాడి బాలీవుడ్ లో కలకలం రేపింది. ఈ ఘటనతో ముంబై లాంటి మహా నగరంలో సెలబ్రిటీల భద్రతపై సందేహాలు, అనుమానాలు తలెత్తాయి. ముఖ్యంగా దాడి సమయంలో సైఫ్- కరీనాల ఇంట్లో సెక్యూరిటీ గార్డులు లేరా? అని చాలామంది ప్రశ్నలు లేవనెత్తారు. ఇదిలా ఉండగా, ప్రముఖ నటుడు, దర్శకుడు ఆకాశ్దీప్ సబీర్, అతని భార్య షీబా ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో సైఫ్ సతీమణి, నటి కరీనా కపూర్ పై తీవ్ర విమర్శలు చేశారు. ‘ఇంటిని భద్రంగా ఉంచుకోవడానికి కరీనా వద్ద డబ్బుల్లేవా’ అంటూ సూటిగా ప్రశ్నించారు. ‘కరీనా కపూర్ ఒక్కో సినిమాకు కోట్లాది రూపాయలు తీసుకుంటోంది. అయితే ఆమె కనీసం ఇంటి బయట వాచ్ మెన్ ను పెట్టుకోలేకపోతున్నారు. అలాగే సైఫ్ పై దాడి జరిగినప్పుడు అక్కడ కారు డ్రైవర్లు ఎవరూ లేరు. అందువలన అతను ఆటోలో ఆసుపత్రికి వెళ్ళవలసి వచ్చింది. ఒకవేళ వాళ్లకు రూ.100 కోట్లు రెమ్యూ నరేషన్ ఇస్తే వాళ్లు సెక్యూరిటీ, డ్రైవర్ను పెట్టుకుంటారేమో’ అని సైటెరికల్ కామెంట్స్ చేశారు ఆకాశ్ దీప్.
‘నేను కరీనాను కలిసినప్పుడు, ఆమె ఇంకా చిన్నది. సైఫ్, కరీనా పెళ్లి చేసుకున్నప్పుడు, నేను ఒక టీవీ చర్చలో కూర్చుని వారి తరపున మాట్లాడాను. కరిష్మా కపూర్ మొదటి సినిమా ‘సహారా’ నేనే నిర్మించి, దర్శకత్వం వహించాను. అప్పుడు కరీనా నటి కాదు ఆమె ఇంకా చిన్నపిల్ల’. కరీనా ఇంట్లో సెక్యూరిటీ గార్డు ఎందుకు లేడనేది నా ప్రశ్నజ ఒక ఇంట్లో 30 సీసీటీవీలు ఉండవచ్చు. కానీ, వారు దొంగను అడ్డుకుంటారా లేదా ఆపుతారా? సీసీటీవీ నేరాన్ని గుర్తించడంలో మాత్రమే సహాయపడుతుంది, కానీ అది జరగకుండా అడ్డుకోదు. కరీనా దంపతులు తమతో పాటు ఫుల్ టైమ్ డ్రైవర్ను ఎందుకు నియమించుకోలేదు’ అని ప్రశ్నించారు ఆకాశ్ దీప్.
ఇవి కూడా చదవండి
కాగా జనవరి 16న బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్పై దాడి జరిగింది. దొంగతనానికి వచ్చిన ఓ దుండుగుడు నటుడిపై విచక్షణా రహితంగా కత్తితో దాడి చేశాడు. దీంతో సైఫ్ శరీరంపై చాలా చోట్ల గాయాలయ్యాయి. దీంతో కుటుంబ సభ్యులు సైఫ్ ను సమీపంలోని లీలావతి ఆస్పత్రికి తరలించారు. ఐదు రోజులు చికిత్స తర్వాత ఇంటికి చేరుకున్నాడు సైఫ్.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.