యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తోన్న హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘తండేల్’. డైరెక్టర్ చందూ మొండేటి దర్శకత్వంలో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతాఆర్ట్స్ బ్యానర్పై ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీవాసు నిర్మించిన సినిమా ఇది. షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల కానుంది. ఇప్పటికే రిలీజైన ప్రమోషన్స్ కంటెంట్ హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేసింది. విడుదలకు దగ్గరవుతుండటంతో సినిమా ప్రమోషన్స్ స్పీడ్ పెంచేశారు. ఈ సినిమానుంచి విడుదలైన పోస్టర్ దగ్గర నుంచి పాటలు, టీజర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇటీవలే ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంది.
సినిమా పై ఉన్న అంచనాలను ట్రైలర్ తారాస్థాయికి చేర్చింది. ఇక ఈ సినిమాలో అందమైన ప్రేమకథను చూపించనున్నారు. గతంలో లవ్ స్టోరీ సినిమాలో ఆకట్టుకున్న సాయి పల్లవి, నాగ చైతన్య. తండేల్ సినిమాతో మరోసారి ప్రేక్షకులను కట్టిపడేయనున్నారు. ఇదిలా ఉంటే తాజాగా తండేల్ కోసం నాగ చైతన్య, సాయి పల్లవి రెమ్యునరేషన్ గురించి ఆసక్తికర చర్చ జరుగుతుంది.
‘తండేల్ ‘ సినిమా కోసం నాగచైతన్య చాలా కష్టపడ్డారు. ఈ సినిమా కోసం ఆయన దాదాపు 15 కోట్ల రూపాయల పారితోషికం అందుకున్నారని సమాచారం. ఇప్పటివరకు నాగచైతన్య కెరీర్లో అందుకున్న భారీ పారితోషకం ఇదే. అలాగే సాయి పల్లవి చాలా డిమాండ్ ఉన్న నటి . తెలుగుతో పాటు, తమిళ్, మలయాళం, హిందీ సినిమాల్లో బిజీగా రాణిస్తుంది. గ్లామర్ మీద ఆధారపడకుండా, నటనతో అందరి హృదయాలను గెలుచుకుంటుంది. ఇక ‘తండేల్ ‘ సినిమాలో నటించినందుకు సాయి పల్లవికి రూ.5 కోట్లు రెమ్యునరేషన్ ఇచ్చారని టాక్ వినిపిస్తుంది. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు. బన్ని వాసు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ఖచ్చితంగా విజయం సాదిస్తుందని అంటున్నారు అభిమానులు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి