2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఆస్ట్రేలియాకు ఎదురుదెబ్బ తగిలింది. ఒకరిద్దరు కాదు ఏకంగా నలుగురు ఆటగాళ్లను జట్టు నుంచి తొలగించారు. దీనిలో ఒక ఆటగాడు వన్డే నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. కెప్టెన్ పాట్ కమ్మిన్స్ సహా ముగ్గురు ఆటగాళ్లను జట్టు నుంచి తొలగించారు. ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమ్మిన్స్ గురించి చెప్పాలంటే, భారత్తో జరిగిన ఐదు టెస్ట్ల సిరీస్ ముగిసిన తర్వాత అతనికి చీలమండ గాయం అయినట్లు గుర్తించారు. కమ్మిన్స్ ఈ గాయం నుంచి సకాలంలో కోలుకోలేకపోయాడు. అతను ఇప్పుడు రాబోయే ఛాంపియన్స్ ట్రోఫీ 2025 నుంచి పూర్తిగా దూరంగా ఉన్నాడు.
ఆస్ట్రేలియా మరో ఫాస్ట్ బౌలర్ జోష్ హాజిల్వుడ్ కూడా కొంతకాలంగా గాయాలతో బాధపడుతున్నాడు. భారత్తో జరిగిన సిరీస్ సమయంలో, అతనికి కాఫ్ సమస్య వచ్చింది. ఆ తరువాత అతను తుంటి గాయం కారణంగా ఆస్ట్రేలియా జట్టుకు దూరంగా ఉన్నాడు.
పాట్ కమ్మిన్స్, జోష్ హాజిల్వుడ్ తర్వాత, ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్ కూడా రాబోయే ఐసీసీ టోర్నమెంట్కు దూరంగా ఉండబోతున్నాడు. మిచెల్ మార్ష్ పేరు ఇప్పటికే లిస్ట్లో లేడు. ఆస్ట్రేలియా సెలెక్టర్ జార్జ్ బెయిలీ కూడా ఛాంపియన్స్ ట్రోఫీ 2025 నుంచి అతని తొలగింపును ధృవీకరించారు.
ఇవి కూడా చదవండి
ఈ ముగ్గురు ఆటగాళ్లతో పాటు, ఆస్ట్రేలియాకు చెందిన మరో ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్ మార్కస్ స్టోయినిస్ కూడా అకస్మాత్తుగా వన్డే క్రికెట్ నుంచి రిటైర్ కావడం ద్వారా అందరినీ ఆశ్చర్యపరిచాడు. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియా జట్టులో అతని పేరు ఉంది. కానీ, ఇప్పుడు అతని స్థానంలో మరొక ఆటగాడిని తీసుకోవలసి ఉంటుంది. స్టోయినిస్ ఆస్ట్రేలియా తరపున టీ20 అంతర్జాతీయ ఫార్మాట్లో ఆడటం కొనసాగిస్తున్నాడు.
ఇప్పుడు కమ్మిన్స్, జోష్ హాజిల్వుడ్ స్థానంలో సీన్ అబాట్, స్పెన్సర్ జాన్సన్ ఆస్ట్రేలియా జట్టులో చోటు సంపాదించవచ్చు. బ్యూ వెబ్స్టర్ ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్గా చోటు సంపాదించడంలో ముందున్నాడు. మార్ష్ స్థానంలో భారత్తో జరిగిన చివరి టెస్ట్ మ్యాచ్లో అరంగేట్రం చేయడం ద్వారా అతను ఆకట్టుకున్నాడు.
ఆస్ట్రేలియా జట్టు గురించి చెప్పాలంటే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కి ముందు ఆస్ట్రేలియా జట్టు శ్రీలంకలో రెండు మ్యాచ్ల ODI సిరీస్ ఆడనుంది. దీనిలో పాట్ కమిన్స్ స్థానంలో స్టీవ్ స్మిత్ లేదా ట్రావిస్ హెడ్ను ఆస్ట్రేలియా వన్డే కెప్టెన్గా నియమించవచ్చు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..